యాప్నగరం

Hyderabad: కిడ్నీ వ్యాధితో బాధపడుతూ పెద్దపులి మృతి

Nehru Zoological Park: హైదరాబాద్‌ నెహ్రూ జూపార్కులో రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ రకానికి చెందిన ఓ పెద్దపులి మృతి చెందింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ పెద్దపులి మృతి చెందినట్లు జూ అధికారులు వెల్లడించారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 6 Apr 2023, 4:43 pm

ప్రధానాంశాలు:

  • నెహ్రూ జూపార్క్‌లో పెద్దపులి మృతి
  • కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మృత్యువాత
  • పది రోజుల క్రితం ఓ చీతా కూడా మృతి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Nehru Zoological Park
పెద్దపులి మృతి
Nehru Zoo Park: హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్కులో నెహ్రూ జూపార్కులో ఇటీవల ఓ చీతా గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే మరో మూగజీవి ప్రాణాలు కోల్పోయింది. రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ రకానికి చెందిన ఓ పెద్దపులి బుధవారం ప్రాణాలు విడిచింది. ఈ 15 ఏళ్ల మగ పులి ఆరు నెలల క్రితం కిడ్నీ వ్యాధి బారిన పడినట్లు జూ అధికారులు వెల్లడించారు. అప్పటి నుంచి పులికి వెటర్నరీ డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం క్షీణించి పులి మృతి చెందినట్లు జూ క్యూరేటర్‌ ప్రశాంత్‌ బాజీరావు పాటిల్‌ వెల్లడించారు.
పది రోజుల క్రితం హైదరాబాద్ నెహ్రూ జూపార్కులో ఓ చీతా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. మగ చీతా అబ్దుల్లా (15) గుండెపోటుతో మృత్యువాత పడింది. జూ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన చీతా గుండెపోటుతో చనిపోయినట్లు నిర్ధారించారు. చనిపోయిన చీతా గత పదకొండేళ్లుగా సందర్శకులను ఆకట్టుకుంటున్నట్లు జూ అధికారులు వెల్లడించారు. సౌత్ ఇండియాలో మైసూర్‌తో పాటు హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లోనే చీతాలు ఉండేవి.

2011లో సౌదీ రాజ కుటుంబీకులు హైదరాబాద్‌ జూను సందర్శించారు. జూలో ఉన్న జంతువులు, వాటి నిర్వహణ వంటి చూసి ముగ్ధులై 2012లో ఒక జత ఆడ, మగ చీతాలను నెహ్రూ జూకు బహుమానంగా అందించారు. అప్పడు ఆ చీతాల వయస్సు నాలుగేళ్లుగా జూ అధికారులు వెల్లడించారు. పన్నెండేళ్ల వయస్సులో 2020లో ఆడ చీతా అనారోగ్యం కారణంగా మృతి చెందినట్లు జూ అధికారులు వెల్లడించారు. అప్పటి నుంచి మగ చీతా అబ్దుల్లా ఒంటరిగా ఉండేది. పది రోజుల క్రితం అబ్దుల్లా కూడా మరణించటంతో ప్రస్తుతం జూలో చీతాలు లేకుండా పోయాయి.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.