రెండున్నరేళ్ల ఓ బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ మొదటి అంతస్తు నుంచి కిందపడి దుర్మరణం పాలయ్యాడు. హైదరాబాద్లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతానగర్ బస్తీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. శ్రినిష్ అనే బాలుడు ఆడుకుంటూ మొదటి అంతస్తు నుంచి కింద పడిపోయాడు. బాలుడి అరుపులు విని పరుగెత్తుకొచ్చిన తల్లి శ్వేత.. బంధువులతో కలిసి వెంటనే అతడిని స్థానిక హాస్పిటల్లో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం (జూన్ 29) ఉదయం 11:30 గంటల సమయంలో మృతి చెందాడు.
ఇంట్లో వాళ్లు వారి వారి పనుల్లో నిమగ్నమై ఉండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
రైల్వే ట్రాక్పై వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన సిగ్నల్స్మ్యాన్, హ్యాట్సాఫ్
ఇంట్లో వాళ్లు వారి వారి పనుల్లో నిమగ్నమై ఉండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
రైల్వే ట్రాక్పై వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన సిగ్నల్స్మ్యాన్, హ్యాట్సాఫ్