యాప్నగరం

'ఒక్క పైసా తీసుకున్నా సర్వనాశనమైపోతా'.. అమ్మవారి సాక్షిగా కన్నీళ్లతో రేవంత్ ప్రమాణం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే.. ఈటల ఆరోపణలపై స్పందించిన రేవంత్.. అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేస్తానని ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. అన్నట్టుగానే రేవంత్ ఈరోజు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేశారు. రేవంత్ రెడ్డిని కొనేటోడు ఇంకా పుట్టలేదని.. ఇక ముందు కూడా పుట్టబోడని.. ఒక్క పైసా తీసుకున్నా సర్వనాశనమైపోతానని కన్నీళ్లతో ప్రమాణం చేశారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 22 Apr 2023, 7:50 pm

ప్రధానాంశాలు:

  • భాగ్యలక్ష్మి ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రమాణం
  • ఒక్క పైసా తీసుకున్నా సర్వనాశనమైపోతానని భావోద్వేగం
  • ఈటల రాజేందర్‌పై తీవ్ర స్థాయిలో మండిపాటు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu revanth promise
రేవంత్ రెడ్డి
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌ చేసినట్టుగానే.. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు. మెడలో అమ్మవారి కండువా వేసుకుని.. కళ్ల నిండా కన్నీళ్లతో రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. "మునుగోడు ఉపఎన్నికలో కేసీఆర్‌ సాయం గానీ.. బీఆర్ఎస్ పార్టీ సాయం గానీ కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదు. ఒకవేళ నేను చెప్పింది అబద్దమే అయితే మేము సర్వనాశనం అవుతాం. ఒకవేళ మీరు చేసిన ఆరోపణలు అబద్దమైతే మీరేమవుతారో. భయం నా ఒంట్లో లేదు. నేను ఒక హిందువును. అమ్మవారిని నమ్ముతా.. నేను చెప్పింది అబద్దమైతే నేను సర్వనాశనం అవుతా అని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా." అంటూ రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు.
మునుగోడు ఎలక్షన్‌లో ఏం జరిగిందో అందరికీ తెలుసని... ఆ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ వందల కోట్లు ఖర్చు పెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈటల రాజేందర్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆధారాలు చూపలేనని ఆయనే చెప్పారని గుర్తు చేశారు. అయితే.. రేవంత్ రెడ్డిని కొనేటోడు ఇంకా పుట్టలేదని.. ఇక ముందు కూడా పుట్టడంటూ.. భావోద్వేగానికి గురైన రేవంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే.. తాను చేతకానితనంతో కన్నీళ్లు పెట్టుకోలేదని... ఆవేదనతో వచ్చాయని తర్వాత క్లారిటీ ఇచ్చారు రేవంత్.

చివరి రక్తపు బొట్టు వరకు కేసీఆర్‌తో పోరాడతానని రేవంత్ ఉద్ఘాటించారు. కేసీఆర్ వ్యతిరేక గొంతులకు ఇచ్చే గౌరవం ఇదేనా రాజేంద్ర అంటూ ఈటల రాజేందర్‌ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తన కూతురు పెళ్లి రోజునే తనను అరెస్ట్ చేశారని.. చర్లపల్లి జైలులో నిద్రలేని రాత్రులు గడిపాననని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి అంటే ఏంటో తెలంగాణ సమాజానికి తెలుసన్నారు. నోటీసులు రాగానే తాను లొంగిపోయే వాడిని కాదని ఈటలకు చురకలు అంటించారు. ఎవరు ఎవరిని గద్దె దించుతారో భవిష్యత్తులో తెలుస్తుందన్న రేవంత్ రెడ్డి... అందరితో మాట్లాడినట్టు తనతో మాట్లాడకంటూ ఈటల రాజేందర్‌ను రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయంలో చేసిన ప్రమాణంపై ఈటల రాజేందర్ స్పందించారు. ఆలయంలోకి వెళ్లి అమ్మతోడు, అయ్యతోడు అనడం ఏంటని ఎద్దేవా చేశారు. తాను చేసిన వ్యాఖ్యలతో పాటు అన్ని అంశాలపై త్వరలోనే స్పందిస్తానంటూ చెప్పుకొచ్చారు. తాటాకు చప్పుళ్లకు ఈటల రాజేందర్ భయపడడని.. నిజమేంటో అబద్దమెంటో ప్రజలే తేలుస్తారని వ్యాఖ్యానించారు.

రాజసం ఉట్టిపడేలా మనవడికి పేరు పెట్టిన రేవంత్ రెడ్డి.. సంబురపడుతున్న ఫ్యాన్స్‌..!
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.