Drunk Policeman: హైదరాబాద్ (Hyderabad) నగరంలో మందుబాబులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. పీకలా దాకా మద్యం సేవించి.. రోడ్డు మీదికొచ్చి రచ్చ రచ్చ చేస్తున్న ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి మందుబాబులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు (Hyderabad Police) నానా తంటాలు పడుతుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు.. పోలీసుల మీదికే రెచ్చిపోయి నానా హంగామా చేస్తుంటారు. కానీ.. ఈసారి మాత్రం ఓ ట్రాఫిక్ పోలీసే (Traffic constable).. మందుబాబు అవతారం ఎత్తాడు. ఫుల్గా మద్యం సేవించి రోడ్డుపై గోలగోల చేస్తుంటే.. మళ్లీ అదే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఖైరతాబాద్లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మద్యం మత్తులో నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. బి. శ్రీనివాస్.. ట్రాఫిక్ కానిస్టేబుల్గా సైపాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ తన స్నేహితులతో కలిసి ఫుల్లుగా మద్యం సేవించాడు. మత్తు ఎక్కిన తర్వాత.. ఖైరతాబాద్ ఐమాక్స్ ఎదురుగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయం దగ్గరికొచ్చి హల్చల్ చేశాడు. నానా హంగామా సృష్టించాడు. అక్కడితో ఆగకుండా.. రోడ్డు మీదికొచ్చి ద్విచక్రవాహనం మీద వెళ్తున్న యువకులను ఆపాడు. వాళ్లపై దాడి చేశాడు. ఆ యువకులే తప్పు చేశారంటూ వారిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో యువకులకు తీవ్ర గాయాల పాలయ్యాడు. గాయాలైన యువకులు ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాధిత బంధువులు వెంటనే కానిస్టేబుల్పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధిత బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్తో పాటు అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఖైరతాబాద్లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మద్యం మత్తులో నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. బి. శ్రీనివాస్.. ట్రాఫిక్ కానిస్టేబుల్గా సైపాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ తన స్నేహితులతో కలిసి ఫుల్లుగా మద్యం సేవించాడు. మత్తు ఎక్కిన తర్వాత.. ఖైరతాబాద్ ఐమాక్స్ ఎదురుగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయం దగ్గరికొచ్చి హల్చల్ చేశాడు. నానా హంగామా సృష్టించాడు. అక్కడితో ఆగకుండా.. రోడ్డు మీదికొచ్చి ద్విచక్రవాహనం మీద వెళ్తున్న యువకులను ఆపాడు. వాళ్లపై దాడి చేశాడు. ఆ యువకులే తప్పు చేశారంటూ వారిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో యువకులకు తీవ్ర గాయాల పాలయ్యాడు. గాయాలైన యువకులు ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాధిత బంధువులు వెంటనే కానిస్టేబుల్పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధిత బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్తో పాటు అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- Read More Telangana Newsand Telugu News