నగరవాసులకు అలర్ట్.. సికింద్రాబాద్, బేగంపేట్ వైపు ట్రాఫిక్ ఆంక్షలు
నాలా మరమ్మతుల కారణంగా సికింద్రాబాద్, బేగంపేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. రేపటి నుంచి జూన్ 4వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు.
Samayam Telugu 20 Apr 2022, 8:18 pm
హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ అలర్ట్. రేపటి నుంచి నగరంలో పలుచోట్లు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు. నగరంలో నాలా మరమ్మతుల కారణంగా రేపటి నుంచి సికింద్రాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు చెప్పారు. సీటీవో జంక్షన్ నుంచి రసూల్పురా టు బేగంపేట్ వచ్చే వాహనాలను హనుమాన్ దేవాలయం నుంచి ఎడమ వైపునకు మళ్లించనున్నారు. అక్కడి నుంచి కిమ్స్ హాస్పిటల్ మీదుగా మినిస్టర్ రోడ్డులోకి వాహనాలు డైవర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
అదే మాదిరిగా బేగంపేట్ వైపు నుంచి వచ్చే వాహనాలను కిమ్స్ ఆస్పత్రి మీదుగా మళ్లించనున్నారు. వాహనదారులు ఖైరతాబాద్ ఫ్లైఓవర్తో పాటు ఎన్టీఆర్ పార్క్, ట్యాంక్ బండ్ ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. జూన్ నెల 4వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఆయా ప్రాంతాల మీదుగా వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపును గమనించి పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ మేరకు నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ ప్రకటన విడుదల చేశారు.
Also Read:
అదే మాదిరిగా బేగంపేట్ వైపు నుంచి వచ్చే వాహనాలను కిమ్స్ ఆస్పత్రి మీదుగా మళ్లించనున్నారు. వాహనదారులు ఖైరతాబాద్ ఫ్లైఓవర్తో పాటు ఎన్టీఆర్ పార్క్, ట్యాంక్ బండ్ ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. జూన్ నెల 4వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఆయా ప్రాంతాల మీదుగా వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపును గమనించి పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ మేరకు నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ ప్రకటన విడుదల చేశారు.
Also Read: