యాప్నగరం

HYD: హైదరాబాదీలకు అలర్ట్‌.. నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నేటి మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. బీజేపీ భారీ బహిరంగ సభ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్న క్రమంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు ప్రకటించారు.

Authored byRaj Kumar | Samayam Telugu 14 May 2022, 8:50 am
తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో ఇవ్వాళ మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తుండటంతో బీజేపీ శ్రేణులు సభను సక్సెస్ చేసేందుకు అన్ని జిల్లాల నుంచి భారీగా జనసమీకరణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ పోలీసులు వెల్లడించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో శంషాబాద్‌, కల్వకుర్తి, బొంగులూరు, పహాడి షరీఫ్‌ నుంచి తుక్కుగూడకు భారీ వాహనాలు వచ్చే అవకాశం ఉన్న క్రమంలో ఇవ్వాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆ ఏరియాలో ట్రాఫిక్‌ అంక్షలు ఉంటాయని పోలీసులు ప్రకటించారు. అంతేకాకుండా.. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు శ్రీశైలం వైపునకు వాహనాలు అనుమతించబడవని తెలిపారు.

మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు.. ఇంటెలిజెన్స్ రిపోర్టు రాగానే భయపడి లీగల్ నోటీస్ పంపావా?: సంజయ్
ఇటు.. ఎల్బీనగర్‌, హయత్‌ నగర్‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వారు మందమల్లమ్మ, బాలాపూర్‌, వీడియోకాన్‌ జంక్షన్‌ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. మరోవైపు దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, చంద్రాయణగుట్ట నుంచి ఎయిర్‌పోర్ట్‌‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను అరాంఘర్‌, శంషాబాద్‌ మార్గాల్లో మళ్లించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ నంబర్ 14 ద్వారా ఎలాంటి భారీ వాహనాలను నగరంలోకి అనుమతించబోమని పోలీసులు వెల్లడించారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.