యాప్నగరం

హైదరాబాద్‌వాసులకు ట్రాఫిక్ అలర్ట్.. శ్రీరామనవమి రోజు ఆ రూట్లలో ఆంక్షలు

శ్రీరామనవమి సందర్భంగా.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫి ఆంక్షలు విధించారు. ఈ నెల 30న శ్రీరామనవమి వేళ.. రాములవారి శోభాయాత్రలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో.. నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్ మళ్లింపు చేయనున్నారు. హైదరాబాదర్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. పండగ రోజున ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభం కానున్నట్టు పోలీసులు తెలిపారు. శోభాయాత్ర ఏఏ ప్రాంతాల గుండా సాగనుందో వివరించారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 28 Mar 2023, 10:42 pm

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ అలర్ట్
  • శ్రీరామనవమి రోజున పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
  • శోభాయాత్ర జరిగే ప్రాంతాల వివరాలు వెల్లడి

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu telangana
ట్రాఫిక్
హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ అలర్ట్. శ్రీరామనవమి పండగ సందర్భంగా 30వ తేదీన ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటన విడుదల చేశారు. శ్రీరామనవమి సందర్భంగా నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్ డైవర్షన్ ఉన్నట్లు తెలిపారు. పండగ రోజున రాములవారి శోభాయాత్ర ఉండనున్న నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నట్టు వెల్లడించారు. పోలీసులు విధించినన ట్రాఫిక్ ఆంక్షలను పాటిస్తూ వాహనదారులు తమ తమ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు. 30వ తేదీన శ్రీరామనవమి శోభాయాత్ర ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానుండగా.. యాత్ర సాగే ప్రాంతాల వివరాలను పోలీసులు వెల్లడించారు.

సీతారాంబాగ్ ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమవగా.. బోయిగూడ కమాన్, గంగబౌలి ఎక్స్‌రోడ్, గాంధీ బొమ్మ, బేగంబజార్ ఛత్రీ, ఎస్‌ఏ బజార్, శంకర్ హోటల్, పుట్లీబౌలీ ఎక్స్ రోడ్, ఆంధ్ర బ్యాంక్, డీఎం అండ్ హెచ్‌ఎల్ జంక్షన్, హనుమాన్ టెక్డీ లైన్ మీదుగా వచ్చి హనుమాన వ్యాయమశాల వరకు శోభాయాత్ర సాగనుంది. కాగా.. శోభయాత్ర సందర్భంగా.. అటు గోషామహల్ రూట్లలోని పది మార్గాల్లో, ఇటు సుల్తాన్ బజార్‌లోని పదకొండు మార్గాల్లో డైవర్షన్స్ ఉండనున్నాయని పోలీసులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. అటు ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ దగ్గర కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ఏజీ కాలనీ నుంచి లక్ష్మీకాంప్లెక్స్ వరకు నాలా రిపేర్ పనులు జరుగున్న నేపథ్యంలో 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. మార్చి 28 నుంచి జులై 28 వరకు 90 రోజుల పాటు అక్కడ ట్రాఫిక్ ఆంక్షలుంటాయని పేర్కొన్నారు. నాలా పనులు జరుగుతున్న మార్గాల్లో అవసరాన్ని బట్టి ట్రాఫిక్‌ను డైవర్ట్ చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.

వరల్డ్ టూరిస్ట్‌ ప్లేస్‌గా ట్యాంక్‌బండ్.. కిలోమీటర్ పరిధిలోనే 16 పర్యటక ప్రాంతాలు
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.