యాప్నగరం

Traffic Restrictions: సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్లకండి

Traffic Restrictions: తెలంగాణ కొత్త సెక్రటేరియట్‌కు ప్రారంభోత్సవం సందర్భంగా నగర పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు రోడ్లను పూర్తిగా మూసివేయనున్నారు. దీంతో వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరారు.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 30 Apr 2023, 9:03 am
Traffic Restrictions: నేడు తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఉదయం నుంచి పూజలు, హోమాలు మొదలయ్యాయి. సెక్రటేరియట్ ప్రారంభోత్సవం సందర్భంగా వీవీఐపీ, వీఐపీల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సచివాలయం పరిసర ప్రాంతాల్లో వాహనాలను అనుమతించకుండా రోడ్లను క్లోజ్ చేయనున్నారు.
Samayam Telugu tankbund
ట్రాఫిక్


వీవీ విగ్రహం-నెక్లెస్ రోటరీ-తెలుగుతల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ- పీవీఎన్ఆర్ మార్గ్ -నల్లగుట్ట మార్గాలను పూర్తిగా మూసివేయనున్నారు. వీవీ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్, నల్లగుట్ట జంక్షన్, మింట్ కాపౌండ్ రోడ్, బడా గణేష్ జంక్షన్ రోడ్లు మూసివేసి ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వీవీ విగ్రహం జంక్షన్, పాత సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్ర భారతి జంక్షన్, మింట్ కాపౌండ్ జంక్షన్, తెలుగుతల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుంట జంక్షన్, కట్టమైసమ్మ, ట్యాంక్ బండ్, లిబర్టీ జంక్షన్ల వైపు ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నారు. వాహనదారులు సహకరించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

కర్బలా-రాణిగంజ్-సికింద్రాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ట్యాంక్‌బండ్ వద్ద అనుమతించనున్నారు. ఇక ఇక్బాల్ మినార్ నుంచి వచ్చే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్-ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు. ఈ మార్గంలో వచ్చే వాహనదారులను తెలుగుతల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద మళ్లించనున్నారు. ఎన్టీఆర్ ఘాట్, ఐమాక్స్ పార్కింగ్ పక్కన, ఫార్ములా ఈ రేస్ రోడ్, బీఆర్కే భవన్ లైన్, నెక్లెస్ రోడ్డులో పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ట్రాఫిక్ సూచనలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులకు తమకు సహకరించాలని, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

సచివాలయంలో ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఉదయం 10.30 గంటల వరకు నూతన భవనంలో సుదర్శన యాగం, చండీహోమం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.58 గంటల నుంచి 2.04 గంటల మధ్య ఒకేసారి సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు సచివాలయంలో కొలువుతీరనున్నారు. పోడు పట్టాల మార్గదర్శకాలపై కేసీఆర్ తొలి సంతకం చేయనున్నారు. నూతన సచివాలయం ఆరో అంతస్తులో సీఎం ఛాంబర్ ఉండనుంది. రెండో అంతస్తులో హరీష్ రావు, మూడో అంతస్తులో కేటీఆర్ కార్యాలయాలు ఉన్నాయి. మధ్యాహ్నం 2.15 గంటల నుంచి 2.45 గంటల వరకు కేసీఆర్ ప్రసంగం ఉండనుంది. రూ.1200 కోట్ల వ్యయంతో సచివాలయాన్ని నిర్మించారు.



  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.