యాప్నగరం

Bathukamma: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ టైంలో బయటకు రావొద్దు

తెలంగాణ పండగైన బతుకమ్మ సంబరాలు నేటితో ముగియనున్నాయి. పూల సంబరాల్లో చివరిదైన సద్దుల బతుకమ్మ వేడుకలను ఇవాళ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని.. వాహనదారులు గమనించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Edited byరావు | Samayam Telugu 3 Oct 2022, 8:51 am

ప్రధానాంశాలు:

  • ఎల్బీ స్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలు
  • హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
  • మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు అమలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Hyderabad Traffic Restrictions
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ పండగైన బతుకమ్మ సంబరాలు నేటితో ముగియనున్నాయి. పూల సంబరాల్లో చివరిదైన సద్దుల బతుకమ్మ వేడుకలను ఇవాళ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని.. వాహనదారులు గమనించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
బషీర్‌బాగ్, పీసీఆర్ జంక్షన్, రవీంద్రభారతి, లిబర్టీ, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, తెలుగుతల్లి, మోజంజాహి మార్కెట్, నాంపల్లి, అబిడ్స్, నారాయణగూడ, హిమాయత్ నగర్, ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలు, అంబేడ్కర్ విగ్రహం, కవాడిగూడ, కట్టమైసమ్మ ఆలయం, కర్బాలమైదాన్, బైబిల్ హౌస్, రాణిగంజ్, నల్లగుట్ట జంక్షన్లలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఎల్బీ స్టేడియం, లిబర్టీ జంక్షన్‌తో పాటు అప్పర్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉందని.. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని చెప్పారు.

సద్దుల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విజయాలనందించే విజయ దశమిని స్వాగతిస్తూ ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని కేసీఆర్ చెప్పారు. నిండిన చెరువులు, పచ్చని పంట పొలాల పక్కన ప్రకృతితో మమేకమై, తొమ్మిది రోజు పాటు ఆడబిడ్డల ఆటపాటలతో బతుకమ్మ పండగ సాగిందని గుర్తు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లేలా, ప్రజలంతా సుఖశాంతులతో జీవించేలా దీవించాలని అమ్మవారిని ప్రార్థించారు.
రచయిత గురించి
రావు
గోనె.మహేష్ సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ వెబ్‌స్టోరీ విభాగానికి సంబంధించి స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.