యాప్నగరం

గాలిపటం ఎగరేస్తూ టీఆర్ఎస్ సీనియర్ నేత మృతి

ముషీరాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటివరకు సరదాగా అందరితో కలిసి గాలిపటం ఎగరేస్తూ సరదాగా గడిపారు. అయితే అకస్మాత్తుగా కింద పడిపోవడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు.

Samayam Telugu 15 Jan 2021, 8:16 am
సంక్రాంతి పండుగకు ముందు ఆకాశంలో రంగురంగుల గాలి పటాలు ఎగరేస్తుంటారు. ఇక పండగ రాగానే అందరూ ఇంటి డాబాలపై ఎక్కి గాలిపటం ఎగురవేయడంలో బిజీగా ఉటారు. అయితే... ఈ గాలిపటాలు ఎగురవేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక సరదాగా చిన్నపిల్లలు గాలిపటం ఎగరవేస్తుంటే మాత్రం.. తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే చాలామంది గాలిపటాలు ఎగురవేయడంలో మునిగి అనేక ప్రమాదాల బారిన పడి చనిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
Samayam Telugu టీఆర్ఎస్ నేత మృతి


తాజాగా ఈ గాలిపటం సరదా మరో నిండు ప్రాణాన్ని బలిగొన్నది. ఈ ఘటన ముషీరాబాద్‌లో చోటు చేసుకుంది. గాలిపటం ఎగురు వేస్తూ కింద పడి టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు బంగారు కృష్ణ మరణించారు. బంగారు కృష్ణ సంక్రాంతి పండుగ సందర్భంగా.. బిల్డింగ్‌ పైకి ఎక్కి గాలిపటం ఎగురవేశాడు. ఈ నేపథ్యంలో ఆయన కాలు జారి కింద పడిపోయాడు. దీంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయన మృతితో ఆయన కుటుంబ సభ్యులు, స్థానికులు ఒక్కసారిగా విషాద ఛాయల్లోకి వెళ్లారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.