TRS MLAs Poaching case: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామంచ్రభారతి, సింహయాజీ, నంద కుమార్లను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 45 రోజులుగా వారు జైల్లోనే ఉన్నారు. కాగా.. గత వారం ముగ్గురు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో A1 గా ఉన్న రామచంద్ర భారతి, A2 గా ఉన్న నంద కుమార్లు నేడు చంచల్ గూడ జైలు నుంచి విడులయ్యారు. వ్యక్తిగత పూచీకత్తు, షూరిటీలు కోర్టుకు సమర్పించటంతో బెయిల్ కాపీలు నేడు జైలుకు చేరుకున్నాయి. దీంతో ఇద్దరు నిందితులను జైలు అధికారులు విడుదల చేశారు. కాగా.. వారు విడుదలైన మరుక్షణమే బంజారహిల్స్ పోలీసులు రామచంద్రభారతి, నంద కుమార్లను అరెస్టు చేశారు. నంద కుమార్పై చీటింగ్ కేసులు, రామచంద్రభారతిపై నకిలీ డాక్యుమెంట్ల కేసులు ఉండటంతో జైలు నుంచి విడుదలైన వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. జైలు నుంచి బయటకు రాగానే నంద కుమార్ మీడియాతో మాట్లాడారు. తాను గత 45 రోజులుగా జైల్లోనే ఉన్నట్లు తెలిపారు. తనకు బయటం ఏం జరుగుతుందో తెలియదని.., కేసు గురించి పూర్తిగా తెలుసుకున్నాక మాట్లాడతానని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడిన కాసేపటికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ కేసులో మరో నిందితుడు సింహయాజీ నిన్ననే చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. సింహయాజీ తరఫు న్యాయవాది నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో పూచీకత్తుతో పాటు ఇద్దరు జామీను సమర్పించారు. దీంతో కోర్టు బెయిల్ పత్రాలు మంజూరయ్యాయి. సింహయాజీ తరఫు న్యాయవాది ఈ పత్రాలను చంచల్ గూడ జైలులో సమర్పించగా.. జైలు అధికారులు వాటిని పరిశీలించి బుధవారం ఆయన్ను విడుదల చేశారు.
మరోవైపు ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)కు నాంపల్లి ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. సిట్ అధికారులు దాఖలు చేసిన మోమోను కొట్టేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అనుమానితులుగా ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామి, కరీంనగర్కు చెందిన అడ్వకేట్ శ్రీనివాస్లను నిందితులుగా చేర్చుతూ ఏసీబీ కోర్టులో సిట్ మెమో దాఖలు చేసింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పోలీసులు దాఖలు చేసిన మోమోను కొట్టేసింది. పీసీ యాక్ట్ కేసుల్లో ఏసీబీకి మాత్రమే దర్యాప్తు అధికారం ఉందని, లా అండ్ ఆర్డర్ పోలీసులకుగానీ, సిట్కుగానీ విచారణ చేసే అధికారం లేదని స్పష్టం చేశారు. మంగళవారం సిట్ మోమోపై విచారణ చేపట్టిన కోర్టు ఆ మెమోను రిజెక్ట్ చేసింది.
మరోవైపు ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)కు నాంపల్లి ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. సిట్ అధికారులు దాఖలు చేసిన మోమోను కొట్టేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అనుమానితులుగా ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామి, కరీంనగర్కు చెందిన అడ్వకేట్ శ్రీనివాస్లను నిందితులుగా చేర్చుతూ ఏసీబీ కోర్టులో సిట్ మెమో దాఖలు చేసింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పోలీసులు దాఖలు చేసిన మోమోను కొట్టేసింది. పీసీ యాక్ట్ కేసుల్లో ఏసీబీకి మాత్రమే దర్యాప్తు అధికారం ఉందని, లా అండ్ ఆర్డర్ పోలీసులకుగానీ, సిట్కుగానీ విచారణ చేసే అధికారం లేదని స్పష్టం చేశారు. మంగళవారం సిట్ మోమోపై విచారణ చేపట్టిన కోర్టు ఆ మెమోను రిజెక్ట్ చేసింది.
- Read More Telangana News And Telugu News