యాప్నగరం

బండి బూతుపురాణం, డెడ్‌లైన్స్ అందుకే.. టీఆర్‌ఎస్ కీలక నేత షాకింగ్ కామెంట్స్

బీజేపీ ఫైర్‌బ్రాండ్ నేత బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్ నేత షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన విధిస్తున్న డెడ్‌లైన్స్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Samayam Telugu 14 Jan 2021, 9:17 pm
దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఉప ఎన్నికల్లో ఘన విజయంతో ఫుల్ జోష్ మీదున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ అధికార టీఆర్‌ఎస్ లక్ష్యంగా మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా జనగామ వివాదం నేపథ్యంలో ప్రభుత్వానికి డెడ్‌లైన్ ఇచ్చారాయన. అయితే ఆ విషయంపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, శాసనమండలి చీఫ్ విప్ బొడకుంటి వెంకటేశ్వర్లు ఘాటుగా స్పందించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
bandi sanjay


బండి సంజయ్ హెడ్‌లైన్స్ కోస‌మే ఎంపీ బండి సంజ‌య్ డెడ్‌లైన్లు విధిస్తార‌ని ఎమ్మెల్సీ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద మాట్లాడిన ఆయన.. జనగామ విషయంలో ఒక్కో ఊరిలో ఒక్కో డెడ్ లైన్ పెట్టారన్నారు. చిన్నచిన్న విషయాలకే రాష్ట్రంలో అలజడి రేపాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంపీగా ఉన్న సంజయ్ కాస్త హుందాగా ప్రవర్తించడం నేర్చుకోవాలని హితవు పలికారు.

సీఎం కేసీఆర్‌ని తిడితే పెద్ద లీడర్ అవుతానని భ్రమపడుతున్నారని.. బూతుపురాణం అందుకున్నంత మాత్రాన పెద్దనేతగా ఎదగలేరని విమర్శించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేరు కానీ పెద్దపెద్ద మాటలు మాట్లాడతారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరిగే చిన్నచిన్న విషయాలను భూతద్దంలో చూపుతున్నారని.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి దేశంలో జరిగే అన్ని ఘటనలకు బీజేపీనే కారణమా అని సూటిగా ప్రశ్నించారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.