యాప్నగరం

Uppal Match: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ

SRH vs PBKS: క్రికెట్ అభిమానులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఇవాళ్టి ఉప్పల్ మ్యాచ్ కోసం అదనపు సర్వీసులు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. మెుత్తం 60 అదనపు సర్వీసులను ఉప్పల్ స్టేడియం మార్గంలో నడిపించనున్నట్లు చెప్పారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 9 Apr 2023, 5:26 pm

ప్రధానాంశాలు:

క్రికెట్ ఫ్యాన్సుకు ఆర్టీసీ గుడ్ న్యూస్
ఉప్పల్ మార్గంలో అదనపు సర్వీసులు
60 సర్వీసులు నడపనున్నట్లు అధికారులు వెల్లడి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu TS RTC special buses
ఉప్పల్ మ్యాచ్‌కు ప్రత్యేక బస్సులు
TSRTC హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇవాళ హైదరాబాద్ సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌లో జరగుతున్న రెండో ఐపీఎల్ మ్యాచ్ ఇది. రెండు వరుస ఓటములతో డీలాపడ్డ హోం టీం సన్ రైజర్స్ ఇవాళ్టి మ్యాచ్‌లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ కోసం అభిమానలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా.. క్రికెట్ ఫ్యాన్స్‌కు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.
ఇవాళ్టి మ్యాచ్ కోసం ఆర్టీసీ అదనపు సేవలను నడపనున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని నలు మూలల నుంచి ఉప్పల్‌ స్టేడియం మార్గంలో మొత్తం 60 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. ఇవి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్‌ స్టేడియానికి ప్రయాణికులను చేరవేస్తాయి. మ్యాచ్‌ ముగిసిన తర్వాత తిరుగు పయనం కానున్నాయి. క్రికెట్‌ అభిమానులు సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్‌, పార్కింగ్‌ సమస్యతో ఇబ్బంది పడకుండా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లి మ్యాచ్‌ను వీక్షించాలని అధికారులు సూచించారు. ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించాలంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు.

ఇక ఇవాళ్టి మ్యాచ్ కోసం మెట్రో రైలు సేవలను పొడిగిస్తున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. అర్ధరాత్రి 12.30 గంటలకు చివరి మెట్రో రైలు నడవనుందని చెప్పారు. ఉప్పల్‌ 'స్టేడియం' స్టేషన్‌ నుంచి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. రాత్రి 12.30 గంటల తర్వాత మిగతా స్టేషన్లలో ప్రయాణికులు బయటకు వచ్చేందుకు మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు. మ్యాచ్‌కు రెండు గంటల ముందు నుంచి ఉప్పల్‌కు ఎక్కువ సర్వీసులు తిప్పనున్నట్లు మెట్రో అధికారులు స్పష్టం చేశారు.

మరోవైపు.. మ్యాచ్‌ కోసం పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీ వాహనాలకు అనుమతి నిరాకరించారు. పలు చోట్లు ట్రాఫిక్‌ను డైవర్ట్ చేశారు.

Read More Latest Andhra Pradesh News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.