యాప్నగరం

షిర్డీ వెళ్లే యాత్రికులకు అదిరే ఆఫర్ ప్రకటించిన తెలంగాణ సర్కార్

Shirdi Tour: హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్లాలనుకునేవారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. తక్కువ ధరలో భక్తుల కోసం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక ప్యాకేజీలను తీసుకొచ్చారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 27 Apr 2023, 4:19 pm

ప్రధానాంశాలు:

  • షిర్డీ వెళ్లే వారికి గుడ్‌న్యూస్
  • తెలంగాణ సర్కార్ ప్రత్యేక ప్యాకేజీ
  • రెండు ప్యాకేజీ ప్రకటించిన పర్యాటకశాఖ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu shirdi tour package
షిర్డీ టూర్ ప్యాకేజీ
Shirdi Tour Package: షిర్డీ వెళ్లే యాత్రికులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana State Tourism Development Corporation) గుడ్ న్యూస్ చెప్పింది. షిర్డీ వెళ్లాలనుకునే భక్తల కోసం తెలంగాణ పర్యాటకశాఖ రెండు ప్రత్యేక ప్యాకేజీలు తీసుకొచ్చింది. తక్కువ ధరలో హైదరాబాద్ నుంచి షిర్డీకి ప్యాకేజీలను ప్రకటించింది. రెండు రాత్రులు, ఒక పగలు సాగే ఈ టూర్‌ను ఏసీ, నాన్ ఏసీ ప్యాకేజీలుగా అధికారులు విభజించారు. ఏసీ బస్సులో ప్రయాణానికి పెద్దలకు రూ.3,700, పిల్లలకు రూ.3,010 గా టికెట్ ధరలు నిర్ణయించారు. నాన్ ఏసీ బస్సులో ప్రయాణించాలంటే పెద్దలు రూ.2,400, పిల్లలకు రూ.1,970 గా టారిజం శాఖ అధికారులు టికెట్ ధరలను నిర్ణయించారు.
హైదరాబాద్‌లో ఎంపిక చేసిన పికప్ పాయింట్ల నుంచి ప్రతిరోజు సాయంత్రం బస్సులు బయల్దేరనున్నాయి. బషీర్‌బాగ్, ప్యారడైజ్, బేగంపేట్, కేపీహెచ్‌బీ, దిల్‌షుక్‌నగర్, మియాపూర్ పికప్ పాయింట్ల నుంచి బస్సులు సాయంత్రం షిర్డీకి బయలుదేరతాయని టీఎస్‌టీడీసీ అధికారులు వెల్లడించారు. ఈ టూర్‌లో షిర్డీ సాయినాథుని దర్శన టికెట్ సదుపాయాన్ని మాత్రం చేర్చలేదు. బాబా దర్శనం కోసం భక్తులు ముందుగానే టికెట్ రిజర్వ్ చేసుకోవాలి.

అలాగే మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు కూడా భక్తులు తమ సొంతంగా ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది. టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు https://tourism.telangana.gov.in/package/ShirdiTour వెబ్‌సైట్‌ను సందర్శించాలని భక్తులకు అధికారులు సూచించారు. షిర్డీ వెళ్లాలనుకునే భక్తులకు ఇది బెస్ట్ ఆఫర్ అని టీఎస్‌టీడీసీ అధికారులు వెల్లడించారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.