యాప్నగరం

కారులో జంటను చూసి రాత్రివేళ ఖాకీల బెదిరింపులు.. మహిళతో తప్పుగా ప్రవర్తించి.!

రాత్రివేళ కారులో జంటను చూసి ఇద్దరు ఖాకీలు రెచ్చిపోయారు. వారిని బెదిరించి అందినకాడికి డబ్బులు వసూలు చేసుకున్నారు. అయినా వదలకుండా మరుసటి రోజు మళ్లీ డబ్బులు గుంజారు. కానీ మహిళతో తప్పుగా ప్రవర్తించి సమస్యలు కొనితెచ్చుకున్నారు.

Samayam Telugu 20 Apr 2022, 7:03 pm
కారులో ఒంటరిగా ఉన్న జంటను చూసి ఖాకీలు కక్కుర్తి పడ్డారు. కేసులు పెట్టిస్తామని వారిని బెదిరించి అందినకాడికి డబ్బులు గుంజుకున్నారు. అంతటితో ఆగకుండా మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో వ్యవహారం అడ్డం తిరిగింది. ఆమె నేరుగా పోలీస్ స్టేషన్‌కే వెళ్లి సదరు ఖాకీలపై ఫిర్యాదు చేయడంతో కొలువుకే ఎసరొచ్చింది. ఈ ఘటన ఇప్పుడు సికింద్రాబాద్‌ పోలీస్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
Samayam Telugu car
representing image


బోయిన్‌పల్లిలో రెండు రోజుల కిందట రాత్రివేళ ఒక జంట కారులో ఉన్నారు. వారిని గమనించిన హోంగార్డు ఆకాష్, కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి కారు వద్దకు వెళ్లారు. ఇద్దరూ ఈ సమయంలో ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఇద్దరిపై కేసు నమోదు చేస్తామని బెదిరించడంతో కంగారుపడిన జంట ఎంతోకొంత డబ్బు ముట్టజెప్పేందుకు సిద్ధమయ్యారు. అదే రోజు రాత్రి వారి వద్ద నుంచి ఖాకీలు రూ.15 వేలు వసూలు చేశారు. గూగుల్ పేలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు.

అయినా వదలని హోంగార్డు, కానిస్టేబుల్ మరుసటి రోజు మళ్లీ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు పంపించినప్పటికీ ఆమెను వదల్లేదు. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో విసిగిపోయిన యువతి వారిద్దరిపై బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌లో ఆధారాలను ఇన్‌స్పెక్టర్‌కి చూపించడంతో వారిపై బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు హోంగార్డు ఆకాష్, కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.