యాప్నగరం

పట్టపగలే ఒకరిపై మరొకరు కొడవళ్లతో దాడి.. కారణం తెలిస్తే అవాక్కవుతారు!

Hyderabad: రాజేంద్రనగర్ మాణిక్యమ్మ కాలనికీ చెందిన రమేష్, బాల్ రాజ్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక్కరిపై ఒక్కరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనను చూసిన స్థానికులంతా అక్కడ నుంచి పరుగులు పెట్టారు.

Samayam Telugu 25 Mar 2021, 6:12 pm
హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో ఇద్దరు వ్యక్తులు వీరంగం సృష్టించారు. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే వీరు కొడవళ్లతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. రాజేంద్రనగర్ మాణిక్యమ్మ కాలనికీ చెందిన రమేష్, బాల్ రాజ్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక్కరిపై ఒక్కరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనను చూసిన స్థానికులంతా అక్కడ నుంచి పరుగులు పెట్టారు. కొంతమంది సెల్ ఫోన్‌లో వీడియోలు చిత్రీకరిస్తూ ఉండిపోయారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బుద్వేల్‌లో రమేష్ అనే యువకుడిపై బాలరాజు అనే వ్యక్తి కొడవలితో దాడి చేసినట్లు సమాచారం.
Samayam Telugu నడిరోడ్డుపైనే కత్తులతో దాడి చేసుకుంటున్న వ్యక్తులు
two persons attack in hyderabad


దీంతో రమేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. పశువుల గడ్డి కోసం ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దాడిచేసిన వ్యక్తి బాలరాజు గతంలో ఓ హత్య కేసులో నిందితుడు అని పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తి పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చిన నేరచరిత్ర ఉందని తెలిపారు.

తీవ్ర గాయాలైన వ్యక్తిని స్థానికులు 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కత్తి పోట్లకు గురైన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.