యాప్నగరం

ఈ ఏడాది రేవంత్‌కు కలిసొచ్చేనా?.. పంచాంగకర్త ఏం చెప్పారంటే..

Telangana Congress: గాంధీ భవన్‌లో శోభకృత్ నామ ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రేవంత్, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ సందర్భంగా వేద పండితులు పంచాగ శ్రవణం చేశారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 22 Mar 2023, 5:40 pm

ప్రధానాంశాలు:

  • గాంధీ భవన్‌లో ఉగాది వేడుకలు
  • పాల్గొన్న టీపీసీసీ రేవంత్ రెడ్డి
  • పంచాగ శ్రవణం పఠించిన వేదపండితులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu TPCC Revanth Reddy
టీపీసీసీ రేవంత్ రెడ్డి
TPCC Revanth Reddy: తెలంగాణలో శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది అంటేనే పంచాంగం. ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తు ఎలా ఉందో పంచాంగం ద్వారా తెలుసుకుంటారు. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ ఏడాది తమ అనుకూలతలు, ప్రతికూలతలను పంచాంగం ద్వారా తెలుసునే ప్రయత్నం చేస్తారు. ఇక గాంధీ భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీపీసీసీ రేవంత్ రెడ్డితో పాటు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య, సంపత్, మహేష్ కుమార్ గౌడ్ అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేద పండితులు చిలుకూరు శ్రీనివాస మూర్తి పంచాంగ శ్రవణం పఠించారు. ఈ ఏడాది రాష్ట్రంలో నూతన రాజకీయ కూటములు ఏర్పడతాయని చెప్పారు. టీపీసీసీ రేవంత్ రెడ్డికి ఈ ఏడాది కలిసొస్తుందని.., ఆయనకు అందరూ సహకరించాలని అన్నారు. రేవంత్ వెంట అందరూ నడవాలని చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోకుండా ప్రజలు పాలక పక్షం వైపు ఉంటారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన పెరుగుతుందని అన్నారు. సరిహద్దు వివాదాలు పెరుగుతాయని.. నదులు పొంగి ప్రవహిస్తాయని చెప్పారు. తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో నష్టం జరుగుతుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనూ అల్లర్లు ప్రజలను ఇబ్బంది పెడతాయన్నారు. గంగానది పుష్కరాలు ఏప్రిల్ 23 నుంచి మొదలుకానున్నట్లు శ్రీనివాసమూర్తి వెల్లడించారు.

అనంతరం మాట్లాడిన రేవంత్.. కాంగ్రెస్ శ్రేణులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ స్పూర్తితో ప్రజల వద్దకు వెళ్లాలన్నారు. అధికారం ఒక అవకాశం మాత్రమేనని.. ప్రజలకు నచ్చితే అధికారం కచ్చితంగా ఇస్తారని వ్యాఖ్యనించారు. బలహీన వర్గాలకు ఉంటూ.. ప్రజలకు నచ్చేలా నడుచుకోవాలని కార్యకర్తలకు రేవంత్ సూచించారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.