యాప్నగరం

HYD: ఓయూ పోలీస్ క్వార్టర్స్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం

ఉస్మానియా యూనివర్సిటీ సైక్లింగ్ స్టేడియం సమీపంలోని పోలీస్ క్వార్టర్స్ వద్ద గుర్తు తెలియని మృతదేహం బయటపడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

Samayam Telugu 31 Dec 2021, 5:17 pm
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) సైక్లింగ్ స్టేడియం సమీపంలోని పోలీస్ క్వార్టర్స్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో భయాందోళనలకు గురైన అక్కడి వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఓయూ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


మృతుడు ఓయూ పరిసర ప్రాంతాల్లో చెత్త ఏరుకునే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతదేహం ఆనవాళ్లను బట్టి ఇరవై రోజుల క్రితం చనిపోయి ఉంటాడని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓయూ పోలీసులు డెడ్ బాడీ పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.