యాప్నగరం

Hyderabad: చావులోనూ వీడని బంధం.. భార్యకు తోడుగా భర్త కూడా..

Hyderabad: చావులోనూ భార్యకు తోడుగా నిలిచాడు ఓ భర్త. భార్య లేదనే బాధను తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌లోని కార్మిక నగర్‌లో చోటుచేసుకుంది. పిల్లలను అనాధలుగా మార్చి భార్యాభర్తలు లోకాన్ని విడిచి వెళ్లారు. ఈ ఘటన స్థానికంగా అందరినీ కలిచివేస్తోంది

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 28 Feb 2023, 6:10 pm

ప్రధానాంశాలు:

  • భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య
  • కార్మిక నగర్‌లో విషాదకర ఘటన
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu hyderabad
హైదరాబాద్
Hyderabad: చావులోనూ భార్యకు తోడుగా నిలిచాడు ఓ భర్త. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తల మరణంతో పిల్లలు అనాథలుగా మారారు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి 31న రోడ్డు ప్రమాదం జరిగింది. భరత్ నగర్ ఫ్లై ఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మమత(30 ) అనే మహిళ దుర్మరణం పాలైంది. భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన భర్త.. గత కొద్దిరోజులుగా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. భార్యను మర్చిపోలేక మానసికంగా బాధపడుతున్నాడు. భార్య చనిపోయిందనే మనస్తాపంతో తీవ్ర ఆవేదనకు గురైన భర్త సింప భరత్(36).. చనిపోవాలని నిర్ణయించుకున్నాడు.

మంగళవారం ఉదయం కార్మికనగర్‌లోని తన ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన అనంతరం బంధువులకు మృతదేహాన్ని అందించారు. ఈ ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్య లేదనే బాధలో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.

వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. రెహమత్ నగర్ డివిజన్‌లోకి కార్మిక నగర్‌లో భరత్ కుటుంబం నివాసం ఉంటుంది. బీహెచ్ఈఎల్‌లో ఆర్టీసీ మెకానిక్‌గా భరత్ పని చేస్తున్నాడు. తల్లిదండ్రుల మరణంతో పిల్లలు అనాథలయ్యారు.
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.