యాప్నగరం

చెరువులో కనిపించిన డ్రమ్ము.. దగ్గరికెళ్లి చూస్తే ఒళ్లు జలదరించే దృశ్యం..!

హైదరాబాద్‌ పరిసరాల్లో ఒళ్లు గగ్గుర్పొడిచే క్రైం కథలు రోజుకోటి బయట పడుతున్నాయి. మొండెం లేని తల కేసులో విస్తుపోయే నిజాలు బయటపడి తెల్లారే.. మరో ఘటన వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ చెరువులో డ్రమ్ములో గుర్తుతెలియని మృతదేహాన్ని కుక్కి.. పడేశారు. చెరువులో డ్రమ్మేంటని చూసిన స్థానికులు చూడగా.. ఈ ఘటన బయటపడింది. దీంతో.. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 25 May 2023, 10:08 pm

ప్రధానాంశాలు:

  • రంగారెడ్డి జిల్లాలోని ఓ చెరువులో డ్రమ్ములో మృతదేహాం
  • డ్రమ్ములో శవం చూసి భయబ్రాంతులకు గురైన స్థానికులు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu drumm
హైదరాబాద్‌లో రోజుకో కొత్త క్రైం కథ బయటపడుతోంది. మూసీలో మొడెం లేని తల బయటపడిన ఘటన సంచలనం సృష్టించగా.. దాన్ని కాస్త కదిలిస్తే దృశ్యం సినిమాను మించిన క్రైం స్టోరీ బయటపడింది. ఈ ఘటన నుంచి బయటపడకముందే.. రంగారెడ్డి జిల్లాలోని ఓ చెరువులో ఒళ్లు జలదరించే దృశ్యం కనిపించింది. చెరువులో ఓ డ్రమ్ము కనిపించింది. చెరువులో డ్రమ్మేంటీ అని దగ్గరికెళ్లి చూస్తే.. అందులో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. దీంతో.. తీవ్ర భయభ్రాంతులకు గురైన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఈ ఘటన మహేశ్వరం మండలంలోని తుక్కుగూడలో ఉన్న చెరువులో చోటుచేసుకుంది. ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం డ్రమ్ములో కుక్కి కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, క్లూస్ టీం ఘటన స్థలానికి చేరుకున్నారు. పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఎక్కడో చంపేసి.. మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి తీసుకు వచ్చి చెరువులో పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు డెడ్ బాడీని చెరువులో నుంచి వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. డ్రమ్ములో దొరికిన మృతదేహం ఆనవాళ్లను ఆధారంగా చేసుకుని.. అసలు ఆ వ్యక్తి ఎవరు? అతన్ని ఎవరు హత్య చేశారు? ఎందుకు హతమార్చారు..? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చెరువు చుట్టు పక్కన పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ టీవీ పుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.



సెల్లార్‌లో పాప మృతి కేసులో వెలుగులోకి సంచలన నిజాలు.. ఆ కారు మహిళా ఎస్సైదే.. కానీ..!
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.