యాప్నగరం

హైదరాబాద్‌లో ఆలయ ధ్వంసం... అక్కడే కుక్కను చంపి ఉరి

అమ్మవారి విగ్రహాన్ని పూర్తిగా తొలగించారు. అంతేకాకుండా అక్కడే ఉన్న జంట నాగుల విగ్రహాన్ని కూడా ముక్కలు చేశారు. ఘటనా స్థలాన్ని పలువురు నాయకులు పరిశీలించారు.

Samayam Telugu 25 Jan 2021, 1:08 pm
ఏపీలో పలుచోట్ల ఆలయాలపై దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లో కూడా అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కూకట్‌పల్లి మూసాపేట్ సర్దార్ నగర్ లో దుర్గామాత ఆలయంలో విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహాన్ని పూర్తిగా తొలగించారు .. సమీపంలో ఉన్న జంట నాగుల విగ్రహాన్ని సైతం ముక్కలు చేశారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్ ఆలయం ముందు బైఠాయించారు. ఆలయం ఆవరణలో ఓ కుక్కను కూడా చంపి ఉరివేసి వేలాడదీశారు.
Samayam Telugu ఆలయంపై దాడి
musapet temple attack


Read More: నిర్మల్‌లో ప్రధాని మోదీకి అవమానం

దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలానికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించి అరెస్టు చెయ్యాలని పోలీసులను ఆదేశించారు. ఆలయంలో తిరిగి విగ్రహాలను ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధి చేసేందుకు గాను తాను ఐదు లక్షల రూపాయల విరాళం ఇవ్వనున్నానని తెలిపారు. శునకాన్ని చంపి ఆలయ ఆవరణలో వేలాడదీసి, విగ్రహలను ధ్వంసం చేసిన వారిని తక్షణమే అరెస్టు చెయ్యాలంటూ మూసాపేట కార్పోరేటర్ డిమాండ్ చేసారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.