ముగ్గురు అక్కాచెల్లెళ్ల మిస్సింగ్: ఇది కిడ్నాప్ కాదట.. అసలు ట్విస్ట్ ఏంటో తేల్చిన పోలీసులు
Vanasthalipuram: వనస్థలిపురానికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు ఇంటి నుంచి స్వయంగా వెళ్లిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు ముగ్గురు కలిసి ఇంటి నుండి వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు.
Samayam Telugu 10 Apr 2021, 7:59 pm
ప్రధానాంశాలు:
- ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు బాలికలు మిస్సింగ్
- కేసు నమోదు చేసి, విచారణ జరిపిన పోలీసులు
- కిడ్నాప్ కాదని ద్రువీకరణ
హైదరాబాద్లోని వనస్థలిపురంలో ముగ్గురు అమ్మాయిలు కిడ్నాప్ అయినట్లుగా భావించిన కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. శుక్రవారం ఉదయం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెలు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఒక వ్యక్తిపై అనుమానాలు ఉన్నట్లుగా కూడా పోలీసులకు తల్లిదండ్రులు చెప్పారు. దీన్ని కిడ్నాప్ కేసుగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అయితే, ఈ కిడ్నాప్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
వనస్థలిపురానికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు ఇంటి నుంచి స్వయంగా వెళ్లిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు ముగ్గురు కలిసి ఇంటి నుండి వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. ఈ మేరకు చుట్టుపక్కల కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పోలీసులు పరిశీలించారు.
విచారణలో భాగంగా ఈ ముగ్గురు అమ్మాయిల్లో పెద్దమ్మాయి ప్రేమలో ఉన్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ అవ్వడంతోనే ముగ్గురు కూడపలుక్కొని కలిసి ఇంటి నుండి వెళ్లిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు.
వనస్థలిపురానికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు ఇంటి నుంచి స్వయంగా వెళ్లిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు ముగ్గురు కలిసి ఇంటి నుండి వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. ఈ మేరకు చుట్టుపక్కల కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పోలీసులు పరిశీలించారు.
విచారణలో భాగంగా ఈ ముగ్గురు అమ్మాయిల్లో పెద్దమ్మాయి ప్రేమలో ఉన్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ అవ్వడంతోనే ముగ్గురు కూడపలుక్కొని కలిసి ఇంటి నుండి వెళ్లిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు.