యాప్నగరం

కేసీఆరే వాళ్ల మెడలు నరుకుతున్నారు.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

Telangana BJP: 2009లో నిరాహార దీక్ష చేస్తే 2014లో తెలంగాణ ఎలా వచ్చిందో చెప్పాలని విజయశాంతి ప్రశ్నించారు. బీజేపీ కార్యాలయంలో విజయశాంతి బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.

Samayam Telugu 14 Apr 2021, 8:29 pm
ముఖ్యమంత్రి కేసీఆర్ హాలియా సభలో మాట్లాడిన తీరు మొత్తం పాత చింతకాయ పచ్చడేనని బీజేపీ నాయకురాలు విజయశాంతి కొట్టిపారేశారు. సభకు వచ్చిన జనాన్ని కూడా మందు పోయించి తీసుకొచ్చారని విమర్శించారు. తాను చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తేలేదని, రాష్ట్ర ప్రజల తలలను చావు నోట్లో పెడుతున్నారని ఎద్దేవా చేశారు. 2009లో నిరాహార దీక్ష చేస్తే 2014లో తెలంగాణ ఎలా వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ కార్యాలయంలో విజయశాంతి బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu కేసీఆర్, విజయశాంతి (ఫైల్ ఫోటోలు)
kcr vijayashanti


కేసీఆర్ రాష్ట్రాన్ని నిజంగా అభివ్రుద్ధి చేసి ఉంటే ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవారిని, కానీ ఆయన కళ్లలో భయం కనిపిస్తోందని విజయశాంతి విమర్శించారు. నిరుద్యోగుల ఉద్యోగాల గురించి ఏమీ ప్రస్తావించలేదని అన్నారు. అంబేడ్కర్ జయంతి నాడు కనీసం ఆయన ఫోటోకు ఒక దండ కూడా వేయలేదని, దీన్ని బట్టే కేసీఆర్ ప్రవర్తన ఎంత చెండాలంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. నాగార్జున సాగర్‌లో ఓడిపోతున్నారనే భయంతోనే కొత్తగా మాట్లాడారని అన్నారు. దయచేసి కేసీఆర్ గారూ అహంకారాన్ని మార్చుకోవాలని విజయశాంతి అన్నారు.

‘‘తప్పు చేస్తే కేసీఆర్ మెడ నరుక్కుంటానన్నారు. కానీ, ఆయనే ఇతరుల మెడ నరుకుతున్నారు. నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు జనాలకు మూడు పూటలా మందు పోయిస్తున్నారు. ఎప్పుడూ వారు మత్తులోనే ఉంటున్నారు. ఇంకా వాళ్లు ఏం ఓటేస్తారు?’’ అని విజయశాంతి ఎద్దేవా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.