యాప్నగరం

Minister Ktr: హైదరాబాద్‌కు మరో దిగ్గజ కంపెనీ.. 10 వేల మందికి ఉద్యోగాలు

Minister Ktr: మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తరలివస్తున్నాయి. గత వారం రోజులుగా అమెరికా పర్యటనలోనే కేటీఆర్ ఉన్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 22 May 2023, 9:29 am

ప్రధానాంశాలు:

  • విజయవంతంగా మంత్రి కేటీఆర్ పర్యటన
  • వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ
  • పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న కంపెనీలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu minister ktr
మంత్రి కేటీఆర్
Minister Ktr: మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతోంది. వివిధ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అవుతున్నారు. తెలంగాణ పెట్టబడులకు అనుకూల ప్రాంతమని, తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. దీంతో కేటీఆర్ సూచనతో పలు దిగ్గజ కంపెనీలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తోన్నాయి.
పెట్టబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కేటీఆర్ అమెరికా పర్యటనతో ఇప్పటికే అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించాయి. ఈ క్రమంలో తాజాగా మరో దిగ్గజ కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. వీఎక్స్‌ఐ గ్లోబల్ సొల్యూషన్స్ అనే కంపెనీ హైదరాబాద్‌లో తమ సేవల కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ రాక వల్ల 10 వేల మందికి ఉద్యోగవకాశాలు లభించనున్నాయి. కంపెనీ ప్రారంభించిన మొదటి మూడేళ్లలోనే 5 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు వీఎక్స్‌ఐ గ్లోబల్ సొల్యూషన్స్ స్పష్టం చేసింది.

ఈ మేరకు కేటీఆర్‌తో వీఎక్స్‌ఐ గ్లోబల్ సొల్యూషన్స్ గ్లోబల్ చీఫ్ హ్యుమన్ రిసోర్సెస్ ఆఫీసర్ ఎరికా బోగర్ సింగ్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా తమ సేవల కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడి అవకాశాలు, ఆర్ధిక ప్రగతి గురించి వివరించారు. ఇక రైట్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభించనున్న తమ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభోత్సవానికి కేటీఆర్‌ను ఆహ్వానించారు. ఇక వరంగల్‌లో డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని రైట్ సాఫ్ట్‌వేర్ ప్రకటించింది. అలాగే టెక్‌జోన్స్ సంస్థ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, డిజైన్ థింకింగ్ కోసం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. కేటీఆర్ పర్యటనతో ఇలా అనేక కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి.



  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.