యాప్నగరం

BJPలోకి జీవితా రాజశేఖర్.. బండి సంజయ్ సమక్షంలోనే ఎందుకు..? ప్లాన్ అదేనా..?

YSRCP | గత ఎన్నికల ముందు వైఎస్సార్సీపీలో చేరిన జీవితా రాజశేఖర్.. రెండేళ్లయినా తిరగకముందే బీజేపీలో చేరారు. ఈసారి తన భర్త తోడు లేకుండా ఒంటరిగా పార్టీ మారారు.

Samayam Telugu 5 Jan 2021, 10:34 am
సినీ నటి, హీరో రాజశేఖర్ సతీమణి జీవిత బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ అథ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో ఆమె కమలం పార్టీలో చేరారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ సమక్షంలో జీవిత, రాజశేఖర్ దంపతులు వైఎస్సార్సీపీలో చేరారు. కానీ రెండేళ్లయినా గడవక ముందే మళ్లీ పార్టీ మారారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్‌లో చేరిన వీరు.. అనంతరం బీజేపీలో చేరారు. ఆ తర్వాత మళ్లీ వైఎస్సార్సీపీ గూటికి చేరారు.. కొన్నాళ్లకే టీడీపీకి జైకొట్టి.. గత ఎన్నికల ముందు జగన్‌ పార్టీలో చేరారు.
Samayam Telugu jeevitha bjp


జగన్‌లో ఎంతో మార్పును చూశాం.. ఆ రోజు ఉన్న జగన్ గారు వేరు.. ఈ రోజు ఉన్న జగన్ గారు వేరంటూ.. వైఎస్సార్సీపీలో చేరిన సందర్భంగా వ్యాఖ్యానించిన జీవిత.. ఇలా రెండేళ్లు తిరక్కుండానే పార్టీ మారడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేసిన రాజశేఖర్ దంపతులు పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు సైతం వేశారు. ప్రస్తుతం జీవిత ఒక్కరే బీజేపీలో చేరారు.

ఇప్పటి వరకూ వైఎస్సార్సీపీలో ఉన్న జీవిత.. బీజేపీలో చేరాలంటే.. సోము వీర్రాజు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోవాల్సింది. కానీ జీవిత తెలంగాణ రాజకీయాల పట్ల ఆసక్తితో ఉన్నారని.. అందుకే బండి సంజయ్ సమక్షంలో పార్టీలో చేరారనే ప్రచారం జరుగుతోంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో జీవిత రాజశేఖర్ దంపతులు ఓ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారని.. అందుకే బీజేపీలో చేరారనే ప్రచారం జరుగుతోంది. మరి పార్టీలో చేరిన జీవితకు కండువా కప్పడానికే ఆసక్తి చూపని బండి సంజయ్.. ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా..? అసలు ఇంతకు రెండేళ్లయినా గడవక ముందే వైఎస్సార్సీపీ నుంచి జీవిత ఎందుకు బయటకొచ్చారు..? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.