యాప్నగరం

భర్తపై సలసల కాగే నూనె పోసిన భార్య, కూతురు మరో ఘాతుకం.. చివరికి ఇద్దరూ కలిసి..

Jagathgiri Gutta: పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుస్నాబాద్‌కు చెందిన సదయ్య, రజిత గత కొంతకాలం క్రితం నగరానికి వచ్చి జగద్గిరిగుట్ట దీనబందు కాలనీలో నివాసం ఉంటున్నారు.

Samayam Telugu 9 Feb 2021, 10:32 pm
హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిపై అతని కట్టుకున్న భార్య, కన్న బిడ్డలు కలిసి సలసల మరిగే నూనెను పోశారు. అంతేకాకుండా అతనిపై గొడ్డుకారం చల్లి పరారైపోయారు. భార్యా బిడ్డలే ఈ ఘాతుకానికి ఒడిగట్టడం విస్మయం కలిగిస్తోంది. బాధితుడు పెద్దగా కేకలు వేయడంతో ఆ తల్లీకూతుళ్లు ఇంటి నుంచి పారిపోయారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
wife pours hot oil


పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుస్నాబాద్‌కు చెందిన సదయ్య, రజిత గత కొంతకాలం క్రితం నగరానికి వచ్చి జగద్గిరిగుట్ట దీనబందు కాలనీలో నివాసం ఉంటున్నారు. సదయ్య కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాడు. అయితే గత నెలలో కుటుంబ కలహాల వల్ల రజిత పుట్టింటికి వెళ్లి పోయింది. వారం క్రితమే భర్త దగ్గరికి వచ్చింది. మళ్లీ వారి మధ్య గొడవలు, తగాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

ఈ క్రమంలో సదయ్య వ్యాపారానికి వెళ్లి.. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాగా.. అతను ఇంట్లోకి రాకుండా అతని భార్య, కూతురు ఇంటి గేటుకు తాళం వేసేసుకున్నారు. గేట్ తీయాలని ఎంత పిలిచినా రాలేదు. దాంతో సదయ్య పక్క ఇంట్లో నుంచి తన ఇంట్లోకి వెళ్లాడు. అయితే సదయ్యపై ఆగ్రహంగా ఉన్న తల్లీ, కూతుళ్లు అతనిపై అప్పటికే కాగుతున్న వేడి వేడి నూనెను పోశారు. అంతటితో ఆగక కారం చల్లారు. దాంతో నూనె వేడిమిని తట్టుకోలేక సదయ్య గట్టిగా అరిచాడు. చుట్టుపక్కల వాళ్లు స్పందించి పరిగెత్తుకుంటూ రాగా.. అప్పటికే తల్లీకూతుళ్లు పారిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుణ్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన తల్లీకూతుళ్లను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.