యాప్నగరం

Hyderabad: ఇలా చేస్తే.. కేవలం రూ.20 కే ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు..!

Hyderabad: హైదరాబాద్‌ నగరం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లాలంటే.. ప్రయాణికులకు తడిసి మోపెడవుతోంది. అలా కాకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మెట్రో సేవలను ఎయిర్‌పోర్టు వరకు విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. కానీ.. అసలు మెట్రో సాయం లేకుండా.. కేవలం 20 రూపాయలకే ఎయిర్‌పోర్టుకు వెళ్లే మార్గం కూడా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎంటీ.. 2000 పైనే ఖర్చయ్యే ప్రయాణాన్ని కేవలం 20 రూపాయలతోనే విమానాశ్రయానికి వెళ్లొచ్చా.. ఎలా అనుకుంటున్నారా..?

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 4 Dec 2022, 7:40 pm

ప్రధానాంశాలు:

  • శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కేవలం 20 రూపాయలతో ప్రయాణం
  • మెట్రో కంటే తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయవచ్చని సూచనలు
  • కేవంల 60 కోట్లు ఖర్చుపెడితే చాలు ఇది సాధ్యమంటున్న విశ్లేషకులు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu shamshabad
Hyderabad: రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు నిర్మించదలచిన మెట్రో సెకండ్ ఫేస్ ప్రాజెక్టు హైదరాబాద్‌ వాసులను ఊరిస్తోంది. అయితే.. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎయిర్ పోర్టుకు వెళ్లే వారికి.. అక్కడి నుంచి నగరానికి వచ్చే వాళ్లకు ప్రయాణం సునాయాసమవుతుంది. ఇదిలా ఉండగానే.. మరోవాదన తెరపైకి వచ్చింది. కేవలం 20 రూపాయలకే నగరం నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లొచ్చంటా. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో.. ఎంఎంటీఎస్‌ రైళ్లను విమానాశ్రయానికి నడపాలని నిర్ణయించారు. అయితే 2014లోనే ఎంఎంటీఎస్‌ రెండోదశ ప్రారంభించారు.. కానీ ఎయిర్‌పోర్టు వరకూ అనుమతించకపోవడంతో ఉందానగర్‌ వరకే వచ్చింది. విమానాశ్రయానికి 6 కిలోమీటర్ల దూరంలోనే ఎంఎంటీఎస్‌ ఆగిపోయింది. అయితే.. ఇప్పుడు.. సర్కారు రాయదుర్గం నుంచి విమానాశ్రయానికి మెట్రో మార్గం నిర్మించేందుకు 6 వేల కోట్ల అంచనాతో పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ కారిడార్‌ను కలుపుతూ జరుగనున్న ఈ నిర్మాణం ఆహ్వానించదగ్గదే కానీ.. ఎంఎంటీఎస్‌ రెండోదశకు ఉన్న అవాంతరాలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు.
కేవలం రూ. 60 కోట్లు వెచ్చిస్తే విమానాశ్రయానికి ఎంఎంటీఎస్‌ చేరుకుంటుందంటున్నారు విశ్లేషకులు. స్టేషన్ల నిర్మాణాలతో పాటు మిగత పనులన్నీ కలిపితే రూ.100 కోట్లలో రెండో దశ ఎంఎంటీఎస్ పనులు పూర్తవుతాయని చెబుతున్నారు. ఇది గనక చేస్తే.. కేవలం 20 రూపాయలతోనే నగరం నుంచి విమానాశ్రయానికి రాకపోకలు సాగించవచ్చని జంటనగరాల సబర్బన్‌ ప్రయాణికుల సంఘం ప్రధానకార్యదర్శి నూర్‌ మహ్మద్‌ పేర్కొన్నారు.

విమానాశ్రయం నుంచి క్యాబ్‌‌లలో రావాలంటే వేలల్లోనే సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మెట్రో అందుబాటులోకి వచ్చినా.. అది ఎంఎంటీఎస్‌ కంటే ఎక్కువే ఉంటుంది. మరోవైపు ఎయిర్‌పోర్టులో పని చేసే వేలాది మంది ఉద్యోగులకు కూడా ఈ ఎంఎంటీఎస్ వల్ల ఉపయోగం ఉంటుందని ఎంఎంటీఎస్‌ ప్రయాణికుల సంఘం ప్రధానకార్యదర్శి చందు తెలిపారు. కేవలం 6 కిలోమీటర్లు పొడిగిస్తే విమానాశ్రయానికి ఎంఎంటీఎస్‌లో తక్కువ ధరలోనే ప్రయాణం సాగించవచ్చని చెబుతున్నారు.

  • Read More Telangana News and Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.