యాప్నగరం

HYD: సవతి తల్లి కర్కశం.. ఏడేళ్ల కుమారుడిపై ఎంతటి దారుణమంటే?

Hyderabad: హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్నాకలో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలుడిని సవతి తల్లి హత్య చేసింది. ముందుగా బిల్డింగ్ నుంచి తోసేసిన ఆ కఠినాత్మురాలు.. ప్రాణాలతో తిరిగిరావడం చూసి తట్టుకోలేక గొంతు పిసికి చంపేసింది.

Authored byRaj Kumar | Samayam Telugu 23 May 2022, 11:47 am
ఓ మహిళ మానవత్వాన్నే మరిచి సవతి కొడుకుపై దారుణానికి పాల్పడింది. ఏకంగా గొంతు నులిమి హత్య చేసింది. ఈ ఘటన హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భాస్కర్‌ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి గోల్నాకలో నివాసముంటున్నాడు. అయితే అతని ఏడేళ్ల కుమారుడు ఉజ్వల్‌ రెండు వారాల కింద భవనంపై నుంచి పడిపోయాడు. దీంతో అతడికి గాయాలయ్యాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


ఈ క్రమంలోనే గాయపడిన బాలుడిని ఆస్పత్రిలో చేర్పించగా కోలుకుని ఇంటికి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉజ్వల్‌ను సవతి తల్లి సరిత గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అయితే కోలుకున్న కొడుకు ఉన్నపళంగా చనిపోవడంతో తండ్రి భాస్కర్‌కు అనుమానం వచ్చింది. దీంతో నేరుగా పోలీసులను ఆశ్రయించాడు. తన కుమారుడి మృతిపై అనుమానాలున్నట్లు ఫిర్యాదు చేశాడు.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా.. దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరిత తన సవతి కుమారుడిని పథకం ప్రకారమే హత్య చేసినట్టు విచారణలో తేలింది. రెండు వారాల కింద భవనంపై నుంచి తోసేసినా బతకడంతో గొంతునులిమి చంపినట్టు వెల్లడైంది. ముందు అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును హత్య కేసుగా మార్చారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.