యాప్నగరం

విడాకులిచ్చినా వేధింపులు ఆపలేదు.. మాజీ భర్త చేసిన పనికి..

hyderabad : విడాకులిచ్చినా మాజీ భర్త వేధింపులు ఆపలేదు.. కొడుకొని చూడనివ్వకుండా అడ్డుకోవడంతో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలో చోటుచేసుకుంది..

Samayam Telugu 27 Jan 2022, 2:06 pm
హైదరాబాద్‌ శివారులో విషాదం చోటుచేసుకుంది.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు..
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


పోలీసుల వివరాల మేరకు.. షాజహాన్ బేగం, ఇమ్రాన్ దంపతులు.. వీరు ఎంఎం పహాడీ ప్రాంతంలో నివాసముండేవారు.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తరుచూ వేధింపులకు పాల్పడుతుండటంతో షాజహాన్ బేగం భర్తను దూరం పెడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే భార్య షాజహాన్ బేగంను హతమార్చేందుకు భర్త ఇమ్రాన్ విషం కూడా ఇచ్చాడు.. ప్రమాదం నుంచి బయటపడ్డ షాజహాన్ బేగం పెద్దల సమక్షంలో భర్త నుంచి విడిపోయింది..

ఈ క్రమంలోనే షాజహాన్ బేగం వేరుగా ఉంటోంది. అయినా వేధింపులు ఆపని ఇమ్రాన్.. పెద్ద కొడుకుని కలవనివ్వకుండా షాజహాన్ బేగంను ఇబ్బందులు పెట్టాడు.. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన షాజహాన్ బేగం.. ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.