యాప్నగరం

పెళ్లైన వ్యక్తితో పీకల్లోతు ప్రేమ... పండగ రోజే కఠిన నిర్ణయం తీసుకున్న యువతి

పెళ్లై భార్యకు విడాలిచ్చిన వ్యక్తితో ప్రేమలో పడిన కూతురిని తల్లిదండ్రులు మందలించారు. అతడిని కలకుండా చేసేందుకు ఏడాదిగా ఉద్యోగం మాన్పించేసి ఇంట్లోనే ఉంచారు.

Samayam Telugu 16 Jan 2021, 6:51 am
పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడిన యువతి పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకంది. వనస్థలిపురం సీఐ మురళీమోహన్‌ కథనం ప్రకారం... తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ కమ్మగూడలోని రాజ్‌రంజిత్‌ ప్రైమ్‌ హోమ్స్‌ కాలనీకి చెందిన దేవరకద్ర నరేందర్‌గౌడ్‌ కుమార్తె మనస్విని(29) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తోంది.
Samayam Telugu images


అదే కంపెనీలో పనిచేసే నరేందర్‌ అనే వ్యక్తితో మనస్విని ప్రేమలో పడింది. అప్పటికే తనకు వివాహమై భార్యకు విడాకులిచ్చినట్లు నరేందర్ చెప్పినా మనస్విని అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పగా వారు మందలించి ఏడాది క్రితం ఉద్యోగం మాన్పించేశారు. అప్పటి నుంచి మనోవేదనతో బాధపడుతున్న ఆమె గురువారం గదిలోకి వెళ్లి తలుపు గడియపెట్టి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.