యాప్నగరం

ప్రాణాల మీదకు తెచ్చిన పెళ్లి.. బాధతో యువతి.. విషాదం

పెళ్లి ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్థాపానికి గురై అఘాయిత్యానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.

Samayam Telugu 17 Jan 2021, 6:31 pm
ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా కుదరడం లేదని కుంగిపోయిన యువతి అఘాయిత్యానికి ఒడిగట్టింది. తీవ్ర మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడింది. ఆ అత్యంత విషాద ఘటన సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది. తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోయనగర్‌కి చెందిన అనిత(36) పెళ్లి కావడం లేదని మానసికంగా కుంగుబాటుకు గురైంది. పెళ్లి సంబంధం కుదరకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. యువతి బలవన్మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులల్లో విషాదం నెలకొంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
marriage


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.