యాప్నగరం

శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో మహిళ డెడ్‌బాడీ.. అర్ధరాత్రి అఘాయిత్యం

శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో మహిళ డెడ్ బాడీ కలకలం రేపింది. ఆమెను ఎవరైనా చంపేసి తగులబెట్టి ఉంటారని ముందుగా పోలీసులు భావించారు. ఆ తర్వాత ఆత్మహత్యగా నిర్ధారించారు.

Samayam Telugu 9 Jan 2021, 10:27 am
శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో గుర్తుతెలియని ఓ మహిళ ఆత్మహత్య తీవ్ర కలకలం సృష్టించింది. నిత్య రద్దీగా ఉండే ఎన్‌ఎండీసీ కూడలి సమీపంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం శంషాబాద్‌-పహడీషరీప్‌ వెళ్లే మార్గంలో మహిళ మృతదేహం పడి ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శంషాబాద్‌ ఏసీపీ వి.భాస్కర్‌ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు.
Samayam Telugu Image


Also Read: సిద్దిపేటలో విషాదం: చెల్లి పెళ్లి రోజే అన్న దుర్మరణం.. మరో ఇద్దరు కూడా

గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఆనవాళ్లు దొరక్కుండా పెట్రోల్‌ పోసి నిప్పంటించి ఉండవచ్చని అనుకున్నారు మహిళ మెడలో నల్లపూసల గొలుసు, ఒంటిపై ఎరుపు రంగు చీర, అదే రంగు జాకెట్‌ ధరించింది. ఘటనాస్థలంలో పాలిథిన్‌ సంచి, అందులో గాజులు, నీటి బాటిల్‌, పాత దుస్తులు ఉండడంతో దినసరి అడ్డా కార్మికురాలిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. మహిళది తొలుత హత్యగా అనుమానించినా.. దొరికిన ఆనవాళ్లను బట్టి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా నిర్ధారించామని గుర్తించామని తెలిపారు. గురువారం రాత్రి 10 నుంచి శుక్రవారం తెల్లవారుజాము మధ్య సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని డీసీపీ తెలిపారు.

Also Read: అబార్షన్ల ముఠా గుట్టురట్టు.. నల్గొండ జిల్లాలో 9 మంది అరెస్ట్, ఆస్పత్రుల సీజ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.