యాప్నగరం

పుట్టింటికెళ్లిన భార్య.. అదే అదనుగా రెచ్చిపోయి బుక్కైన భర్త.. షాకింగ్

తన ఇద్దరు పిల్లలను తీసుకుని భార్య పుట్టింటికి వెళ్లింది. అదే అదనుగా భావించిన భర్త రెచ్చిపోయాడు. తీరా భర్త బాగోతం తెలుసుకున్న భార్య సాలిడ్ షాకిచ్చింది. మోసం చేశాడని ఫిర్యాదు చేయడంతో పంచాయితీ పోలీస్ స్టేషన్‌కి చేరింది.

Samayam Telugu 10 Feb 2021, 1:16 pm
సాఫీగా సాగిపోతున్న కాపురంలో కలహాలు రేగాయి. పెళ్లి సమయంలో ముట్టజెప్పిన కట్నం డబ్బులు సరిపోలేదని.. ఇంకా తేవాలంటూ భర్త వేధించడం మొదలుపెట్టాడు. ఆయనకి అత్తమామలు కూడా తోడవడంతో భార్య భరించలేకపోయింది. ఇద్దరు ఆడబిడ్డలను తీసుకుని పుట్టింటికి చేరింది. ఎలాగో కాపురాన్ని సరిదిద్దుకోవాల్సిన భర్త.. అదే అదనుగా ఆమెను వదిలించుకునేందుకు మరో మహిళను తీసుకొచ్చాడు. తీరా విషయం తెలుసుకున్న భార్య పోలీసులను ఆశ్రయించింది. ఈ షాకింగ్ ఘటన మెదక్ జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
harassment


తూప్రాన్ మండలం ఘనపూర్‌కి చెందిన స్వప్నకు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల గ్రామానికి చెందిన లక్ష్మీనారయణగౌడ్‌తో వివాహమైంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు సంతానం. వివాహ సమయంలో ఏడున్నర తులాల బంగారం, లక్షన్నర నగదు కట్నకానుకలుగా అందజేశారు. కొద్దికాలం సాఫీగానే సాగిన వారి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం భర్త స్వప్నను వేధించడం ప్రారంభించాడు. పెద్దమనుషులు పంచాయితీ పెట్టి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా అతనిలో ఎలాంటి మార్పూ రాలేదు.

భర్తకి అత్తమామలు, ఆడపడుచులు తోడవడంతో వేధింపులు భరించలేక భార్య తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. పుట్టింటికెళ్లిన భార్యను కాపురానికి తెచ్చుకోవడం మానేసిన భర్త అదే అదనుగా రెచ్చిపోయాడు. అదే అవకాశంగా భావించి మరో మహిళను పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చాడు. ఆ విషయం తెలిసిన భార్య స్వప్న లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. తనకు తెలియకుండా మరో వివాహం చేసుకుని మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.