"ముసలోడే కానీ మహానుభావుడు".. ఇది ఓ సినిమాలోని డైలాగు.. ఈ మహిళను చూస్తుంటే.. దాన్ని "ముసలావిడే కానీ మహాముదురు" అని డైలాగును మార్చేయాలనిపిస్తోంది. రాత్రి పూట అలా జరిగిందంటూ.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి.. ఆగం చేసింది. వెంటనే రంగంలోకి దిగి పోలీసులు దర్యాప్తు చేశాక.. సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. అసలక్కడా ఏమీ జరగలేదని తెలుసుకున్న పోలీసులు.. ఆ ముసలావిడను కటకటాల్లోకి పంపించారు. అయితే.. ఓ దొంగ తన మెడలోని పుస్తెలతాడు ఎత్తుకెళ్లాడంటూ తప్పుడు ఫిర్యాదు ఇచ్చి పోలీసులను బురిడీ కొట్టాలని చూసింది. అది నిజమని నమ్మిన పోలీసులు దర్యాప్తు కొనసాగించగా.. అది ఆ మహిళ ఆడిన నాటకం అని తెలిసింది. దీంతో పోలీసులు మహిళపై కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరు పరిచారు. కోర్టు విచారణ జరిపిన అనంతరం మహిళకు ఐదు రోజులు జైలు శిక్ష విధించింది. ఈ విచిత్ర ఘటన సికింద్రాబాద్లోని కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న చెన్నమ్మ అనే మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి సమయంలో గుర్తు తెలియని కొందరు దుండగులు కత్తితో బెదిరించి తన మెడలో ఉన్న మంగళ సూత్రం లాక్కెళ్లారంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో కార్ఖానా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు. విచారణలో.. చెన్నమ్మ తప్పుగా ఫిర్యాదు చేసిందని.. అసలు చైన్ స్నాచింగ్ జరగలేదని తేలింది.
దీంతో పోలీసులు వెంటనే చెన్నమ్మ తప్పుగా ఫిర్యాదు చేసిందంటూ.. రివర్స్ ఆమెపైనే కేసు నమోదు చేశారు. చెన్నమ్మను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఈ మేరకు విచారణ జరిపి ఆమెకు ఐదు రోజుల జైలు శిక్ష విధించింది. అయితే.. ఇలాంటి వారి వల్ల జన్యూన్గా జరిగిన ఘటనలపై కూడా అనుమానం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉంటుందని.. పోలీసులు చెప్తున్నారు. తమ విలువైన సమయాన్ని ఇలా తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి వృథా చేయవద్దని ప్రజలకు సూచిస్తున్నారు.
దీంతో పోలీసులు వెంటనే చెన్నమ్మ తప్పుగా ఫిర్యాదు చేసిందంటూ.. రివర్స్ ఆమెపైనే కేసు నమోదు చేశారు. చెన్నమ్మను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఈ మేరకు విచారణ జరిపి ఆమెకు ఐదు రోజుల జైలు శిక్ష విధించింది. అయితే.. ఇలాంటి వారి వల్ల జన్యూన్గా జరిగిన ఘటనలపై కూడా అనుమానం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉంటుందని.. పోలీసులు చెప్తున్నారు. తమ విలువైన సమయాన్ని ఇలా తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి వృథా చేయవద్దని ప్రజలకు సూచిస్తున్నారు.
- Read More Telangana News And Telugu News