యాప్నగరం

ఇద్దరికి విడాకులు.! మరొకరిని ప్రేమించిన భార్య.. చివరికి..

ఇద్దరితో వివాహమై.. కొద్దికాలం కాపురం చేశాక తెగదెంపులు చేసుకున్న మహిళ మరొకరితో ప్రేమలో పడింది. అతన్ని నమ్మి పెళ్లి చేసుకుంది. ఐదు నెలలు తిరక్కుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

Samayam Telugu 21 Jan 2021, 6:55 pm
ఇద్దరికి విడాకులిచ్చిన మహిళ.. మరొకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇకపై జీవితం సాఫీగా సాగిపోతుందనుకుంటున్న సమయంలో ఊహించని ఘోరం చోటుచేసుకుంది. వ్యసనాలకు బానిసైన మూడో భర్త ఐదు నెలలు తిరక్కుండానే ఆమెను దారుణంగా హతమార్చాడు. ఈ అమానుష ఘటన హైదరాబాద్‌లో జరిగింది. కర్ణాటకకు చెందిన మోసిన్ ఖాన్, ఫర్హాన్ ఖురేషి(25) భార్యాభర్తలు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్‌లో నివాసముంటున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
love


ఖురేషీకి గతంలో రెండు వివాహాలు జరిగాయి. భర్తలతో విభేదాల కారణంగా ఇద్దరికీ విడాకులు ఇచ్చేసింది. మోసిన్ ఖాన్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఐదు నెలల కిందట అతన్ని మూడో వివాహం చేసుకుంది. వ్యసనాలకు బానిసగా మారిన మోసిన్ ఖాన్ నిత్యం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. దానికి తోడు భార్యపై అనుమానం పెంచుకుని రోజూ గొడవపడేవాడు. మరొకరితో అక్రమ సంబంధం ఉందంటూ వేధించేవాడు. నిన్న రాత్రి మరోమారు గొడవ జరగడంతో ఆగ్రహంతో రగిలిపోయిన మోసిన్ ఖాన్ భార్యను అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.