యాప్నగరం

రాచకొండలో మహిళ దారుణ హత్య.. తీవ్ర కలకలం

మహిళ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు మహిళను బండరాయితో మోది అత్యంత దారుణంగా హతమార్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Samayam Telugu 26 Apr 2022, 9:48 pm
రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని మహిళను దుండగులు అతి దారుణంగా హతమార్చారు. బండరాయితో తలపై మోది కిరాతకంగా చంపేశారు. బడంగ్‌పేటలోని ఓ ఖాళీ స్థలంలో మహిళ మృతదేహం చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో మీర్‌పేట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
Samayam Telugu murder


మృతదేహాన్ని.. హత్య జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీం స్పాట్‌కి చేరుకుని ఆధారాల కోసం సంఘటన స్థలాన్ని జల్లెడ పట్టారు. ఆ ప్రదేశంలో పడి ఉన్న బండరాయికి రక్తం అంటుకుని ఉండడంతో రాయితో మోది చంపేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. చనిపోయిన మహిళ ఎవరనే విషయంపై స్పష్టత వస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది. చనిపోయిన మహిళ ఎవరు? ఎందుకు చంపారు? అనే దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.