యాప్నగరం

ఎర్రగడ్డలో నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య.. పరుగులు తీసిన జనం!

నడిరోడ్డుపై దారుణ హత్య నగరంలో అలజడి రేపింది. ఒంటరి మహిళను దుండగులు కత్తితో పొడవడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. ఆ ఘటన చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Samayam Telugu 11 Jan 2022, 8:27 pm
హైదరాబాద్ నగరంలో నడిరోడ్డులో దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. ఒంటరి మహిళను దుండగుడు కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు. నడిరోడ్డుపై ఆమెపై కత్తితో దాడి చేయడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఈ దారుణ ఘటన ఎర్రగడ్డలో జరిగింది. భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తున్న మహిళపై ఖలీల్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. నడిరోడ్డుపై విచక్షణా రహితంగా పొడవడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


సమాచారం అందుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. రోడ్డుపైనే దుండగుడు ఘాతుకానికి తెగబడడంతో అక్కడ భీతావహ పరిస్థితి ఏర్పడింది. జనం భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. మృతురాలి వివరాలతో పాటు ఆమె హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.