యాప్నగరం

బాబోయ్ మరో ఘోరం.. వివాహితపై అత్యాచారం, హత్య.. అంతే లేదా!!

ఇంటి నుంచి బయటికెళ్లిన మహిళ తిరిగి వస్తుందో లేద చెప్పలేని అత్యంత భయానక పరిస్థితులు దాపురించాయి. ఉదయం పనికి వెళ్లిన వివాహిత హత్యాచారానికి గురైన మరో దారుణ ఘటన హైదరాబాద్ శివార్లలో జరిగింది.

Samayam Telugu 16 Sep 2021, 7:02 pm
మహిళలపై అత్యాచారాలకు అంతే లేకుండా పోతోంది. నిత్యం ఏదో ఘటన భయపెడుతూనే ఉంది. సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహిత మహిళపై అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా హతమార్చిన అమానుష ఘటన చోటుచేసుకుంది. వివాహితపై అత్యాచారం చేసిన దుండుగులు ఆమె గొంతుకోసి.. కాలు నరికి కిరాతకంగా చంపేశారు. ఈ కిరాతక ఘటన రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్లులో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
woman


ఆమనగల్లు పరిధిలోని ముర్తుజపల్లికి చెందిన భార్య(39), భర్త కొద్దికాలం కిందట బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వలస వెళ్లారు. కరోనా కారణంగా భార్య తన పుట్టినిల్లైన మాడ్గుల మండలం చంద్రాయణపల్లికి వచ్చి ఉంటోంది. నగరంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోన్న మహిళ రోజూ ఇంటి నుంచి వెళ్లి వస్తుండేది. రోజు మాదిరిగానే ఆమె మంగళవారం ఉదయం నగరానికి పని కోసం వెళ్లింది. సాయంత్రం 6 గంటల సమయంలో ఆమనగల్లులో ఆటో ఎక్కి వస్తున్నానని చెప్పిన ఆమె ఎంతసేపటికీ ఇంటికి చేరలేదు.

మరుసటి రోజు ఉదయం దారుణ ఘటన వినాల్సి వచ్చింది. పని కోసం వెళ్లిన వివాహిత నుచ్చుగుంట తండా సమీపంలో రోడ్డు పక్కన శవమై కనిపించింది. గుర్తు తెలియని దుండగులు ఆమెపై అత్యాచారం చేసి కిరాతకంగా హతమార్చారు. ఇంటికి వస్తున్నానని చెప్పిన మహిళ అనూహ్యంగా శవమై తేలడం మిస్టరీగా మారింది. మృతదేహానికి సమీపంలోనే ఆమె బట్టలు, మద్యం సీసాలు పడి ఉన్నాయి. వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.