యాప్నగరం

లోను కావాలంటే ‘పర్సనల్‌’గా కలవాలన్న ఆఫీసర్.. చెప్పుతో కొట్టిన మహిళ

మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పని కావాలంటే పర్సనల్‌గా అక్కడికి రావాలంటూ వేధింపులకు దిగిన అధికారికి బాధితురాలు చెప్పుతో బుద్ధి చెప్పింది.

Samayam Telugu 31 Jul 2021, 5:38 pm
కఠిన చట్టాలు అమలు చేస్తున్నా కామ కీచకుల్లో కనీస మార్పు రావడం లేదు. యథేచ్ఛగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. జంకూబొంకూ లేకుండా తమకు అది కావాలంటూ అడిగేస్తున్నారు. పరువు పోతుందనో.. పని కాదేమోనన్న భయంతో కొందరు మహిళలు బయటకు చెప్పుకునేందుకే భయపడుతున్నారు. కానీ.. తనని పర్సనల్‌గా కలవమన్న మున్సిపల్ అధికారిని నడిరోడ్డుపై మహిళ చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పిన షాకింగ్ ఘటన వెలుగుచూసింది.
Samayam Telugu వైరల్‌గా మారిన వీడియో
sangareddy


సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వెంకన్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలున్నాయి. పట్టణంలోని సిద్ధపూర్ గ్రామానికి చెందిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు.. లోను కావాలంటే పర్సనల్‌గా కలవాలంటూ లైంగిక వేధింపులకు గురిచేసినట్లు బాధితురాలు ఆరోపించింది. ఆఫీస్‌కి రాకుండా సమీపంలోని మరో అడ్రస్‌కి రావాలంటూ వేధింపులకు గురిచేయడంతో బాధితురాలు కుటుంబ సభ్యులతో కలసి తిరగబడింది.

నడిరోడ్డుపై శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ని చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది. లైంగిక వేధింపులకు గురిచేసిన వెంకన్నకి బాధితురాలి కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. అతను ఎస్సీ అని.. వాళ్లు కేసు పెడితే మీ మీద కేసు అవుతుందంటూ పోలీసులు భయపెడుతున్నారని ఆమె వాపోయారు. అతన్ని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని.. విధుల నుంచి సస్పెండ్ చేయాలని ఆమె కోరుతోంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.