యాప్నగరం

Alwal: కరోనా భయంతో మహిళా టెక్కీ ఆత్మహత్య

కరోనా భయంతో మహిళా టెకీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అల్వాల్‌లో జరిగింది. రెండు రోజులుగా కూతురు ఫోన్ తీయడం లేదని కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి విగతజీవిగా కనిపించింది.

Samayam Telugu 26 Jan 2022, 10:14 pm
కరోనా మరోమారు విళయతాండవం చేస్తోంది. థర్డ్‌వేవ్ ఉధృతంగా సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రోజూ వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా సోకిందన్న భయంతో మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఒకటి వెలుగుచూసింది. భద్రాచలానికి చెందిన అలేఖ్య(28) అనే యువతి నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ అల్వాల్‌లో నివాసముంటోంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


నాలుగు రోజుల కిందట ఆమె కరోనా బారిన పడింది. ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతోంది. 23 వ తేదీ వరకూ తల్లిదండ్రులతో మాట్లాడింది. అదే రోజు సాయంత్రం నుంచి ఆమె ఫోన్ తీయకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు ఆమె ఇంటికి వచ్చి చూసేసరికి విగతజీవిగా కనిపించింది. ఆమె ఉరికి వేలాడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. కరోనా సోకిందన్న మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.