ఏపీ, తెలంగాణలో యాస్ తుపాను ప్రభావంపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టత ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలపై దాని ప్రభావం అంతగా ఉండక పోవచ్చని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి నుంచి గాలులు లోయర్ ట్రోపోస్పీయర్ వరకు బలంగా వ్యాపించి తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వివరించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరింత బలపడి సోమవారం నాటికి తుపానుగా మారుతుందని, ఈ నెల 25వ తేదీకి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య దిశగా ప్రయాణించి 26న ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు వివరించారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ రాత్రి వరకు అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ అధికార ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఉత్తర వాయువ్య దిశగా కదిలి రేపటికి తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది. ఈ నెల 26న ఉదయం ఒడిశా-బెంగాల్ మధ్య తీరం తాకే అవకాశం ఉందని వివరించారు. అదే రోజు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.
Yaas Cyclone: తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఇలా.. Hyd వాతావరణ కేంద్రం వెల్లడి
Hyderabad: తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ రాత్రి వరకు అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ అధికార ట్విటర్ ద్వారా వెల్లడించింది.
Samayam Telugu 23 May 2021, 9:58 pm
ప్రధానాంశాలు:
- తెలుగు రాష్ట్రాలపై యాస్ ప్రభావం ఉండదు
- హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా
- 25 నాటికి తీవ్ర తుపానుగా..