తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. యువత కూడా ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ యువతికి నిమిషాల వ్యవధిలోనే డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘటన హైదరాాబాద్లో చోటు చేసుకుంది. నగర శివారు ప్రాంతంలోని హయత్నగర్ మండలం అబ్దల్లాపూర్ మెట్లో ఓ యువతికి నిమిషాల వ్యవధిలో రెండో డోసు వేశారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన మహిళ ఆసుపత్రి పాలయ్యింది. హయాత్నగర్ మండలం కుంట్లూరు రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన లక్ష్మీ ప్రసన్న(21) వ్యాక్సిన్ వేసుకునేందుకు బుధవారం అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వచ్చింది. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న నర్సు పద్మ.. ఆ యువతికి ఒక డోసు వ్యాక్సిన్ వేసింది. తనకు టీకా పూర్తి అయ్యిందని తెలియక ఆమె అలాగే కూర్చుండిపోయింది. అయితే, వ్యాక్సిన్ ఇచ్చిన నర్సుకు ఫోన్ కాల్ రావడంతో.. నర్సు మాట్లాడుతూ యువతికి రెండో వాక్సిన్ ఇచ్చేసింది.
దీంతో ఆమె వాక్సిన్ అనంతరం కళ్లు తిరగడంతో కింద పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు వైద్య సిబ్బంది సాయంతో వనస్థలిపురం ఏరియా హాస్పిటల్కు తరలించారు. యువతిని ప్రత్యేక వార్డులో ఉంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. సదరు యువతిని అబ్జర్వేషన్లో ఉంచి పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందన్నారు డాక్టర్లు
దీంతో ఆమె వాక్సిన్ అనంతరం కళ్లు తిరగడంతో కింద పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు వైద్య సిబ్బంది సాయంతో వనస్థలిపురం ఏరియా హాస్పిటల్కు తరలించారు. యువతిని ప్రత్యేక వార్డులో ఉంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. సదరు యువతిని అబ్జర్వేషన్లో ఉంచి పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందన్నారు డాక్టర్లు