యాప్నగరం

నగరంలో దారుణం.. నడిరోడ్డుపై కత్తులతో వీరంగం

హైదరాబాద్ నగరంలో గ్రూపులుగా విడిపోయి యువకులు కొట్టుకుంటున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల కిందట ఒక యువకుడిని నడిరోడ్డుపై కత్తులు, రాడ్లతో దారుణంగా కొట్టి గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది.

Samayam Telugu 22 Mar 2022, 10:12 pm
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. నడిరోడ్డుపై యువకుడిపై కత్తులు, రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన అమానుష ఘటన ఆలస్యంగా బయటికొచ్చింది. యువకుడిపై హత్యాయత్నం చేసినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్‌ పరిధిలోని తోప్‌ఖానాలో ఈ నెల 20 వ తేదీ సలామ్ అనే యువకుడిపై కొందరు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు.
Samayam Telugu clash


అదే ప్రాంతానికి చెందిన మాజీ రౌడీ షీటర్ ఆదిల్ కుమారులు, వారి స్నేహితులు సలామ్‌పై కత్తులు, రాడ్లతో దాడి చేసి కొట్టారు. ఈ దాడిలో సలామ్‌కి తీవ్రగాయాలయ్యాయి. చికెన్ షాప్ ప్రారంభోవ్సవం సమయంలో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. పాత గొడవలు మనసులో పెట్టుకుని యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

ఈ ఘటన రెండు రోజులవుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని.. ఇంటి గొడవ అంటూ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితుడి తరఫు వారు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే నిందితులు అక్కడ కూడా వారిపై దాడి చేసినట్లు చెబుతున్నారు. నిందితులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బాధితుడి బంధువులు కోరుతున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.