యాప్నగరం

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. నిద్రమత్తులో నడుచుకుంటూ యువకుడు మృతి

యువకుడు భవన నిర్మాణ పనుల్లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం పనిచేస్తున్న భవనంలోనే రెండో అంతస్తులో నిద్రపోయారు. తెల్లారేసరికి సత్యనారాయణ అనే యువకుడు పక్క బిల్డింగ్‌పై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.

Samayam Telugu 13 Mar 2021, 8:46 am
రాత్రి నిద్రపోయిన యువకుడు తెల్లారేసరికి విగతజీవిగా మారాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. భవనంపై పడుకున్న యువకుడు నిద్ర మత్తులో నడుచుకుంటూ వెళ్లి పక్కనున్న మరో బిల్డింగుపై పడి మృతిచెందాడు. ఈ ఘటన నగరంలోని సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. రాజస్థాన్‌కు చెందిన సత్యనారాయణ ప్రజాప్రతి (20) మిత్రులతో కలిసి భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. ఆదర్శ్‌నగర్‌లోని హిల్‌పోర్ట్‌ కాలనీ 5వ వీధిలో నిర్మాణంలో ఉన్న భవనం మొదటి అంతస్తులో పని చేస్తోన్న వీరంతా గురువారం రాత్రి రెండో అంతస్తులో పడుకున్నారు.
Samayam Telugu నిద్రమత్తులో యువకుడి మృతి


అయితే శుక్రవారం ఉదయం సత్యనారాయణ పక్క భవనంపై పడి ఉన్నాడు. ఇది గమనించిన పక్క భవనం వాచ్‌మన్‌ ఇంటి యజమానులకు విషయం చెప్పాడు. పక్క భవనంలో పని చేస్తోన్న వారిగా గుర్తించి సమాచారమిచ్చారు. అపస్మారకస్థితిలో ఉన్న అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా శుక్రవారం మృతి చెందాడు. మృతుడి బంధువు ముఖేష్‌ ప్రజాప్రతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైఫాబాద్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.