రెండు బస్సుల మధ్య ఇరుక్కు పోయిన ఒక యువకుడు నరకయాతన అనుభవించి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ సంఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది. సికింద్రాబాదులోని రైత్ ఫైల్ బస్టాప్ లో రెండు బస్సుల మధ్య ఓ యువకుడు ఇరుక్కు పోయాడు. తీవ్రగాయాలతో కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేశాడు. దుర్గాప్రసాద్ అనే యువకుడు రెండు బస్సు ల మధ్య ఇరుక్కు పోయి సాయం కోసం కేకలు పెట్టాడు. అయితే అక్కడ ఉన్న ప్రయాణికులు ఏ ఒక్కరు కూడా చలించలేదు. అక్కడ ఉన్న జనం చూస్తూ ఉండిపోయారు. అంతే కానీ అతని కాపాడేందుకు ప్రయత్నం చేయలేదు. తీవ్రగాయాలతో ఆర్తనాదాలు చేస్తున్న కూడా అతని కాపాడేందుకు ఏ ఒక్కరు కూడా దగ్గరికి వెళ్ళలేదు. ఆర్టీసీ సిబ్బంది వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు.
కానీ దురదృష్టవశాత్తు అంబులెన్స్ వచ్చే లోపే దుర్గాప్రసాద్ మృతి చెందాడు. చివరివరకు ప్రాణాలతో పోరాడి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కానీ దురదృష్టవశాత్తు అంబులెన్స్ వచ్చే లోపే దుర్గాప్రసాద్ మృతి చెందాడు. చివరివరకు ప్రాణాలతో పోరాడి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.