యాప్నగరం

Love Tragedy: నాలుగేళ్లుగా ప్రేమ.. పెద్దల్ని కాదని పెళ్లి.. రెండు నెలలు తిరగకముందే విషాదం

Hyderabad: నాలుగేళ్లుగా వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలు ఒప్పుకోవడంతో వారిని కాదని మరి పెళ్లి చేసుకున్నారు. రెండు నెలలు బాగానే కలిసి ఉన్నారు. ఆ తర్వాత యువతి ఆత్మహత్య చేసుకుంది..

Samayam Telugu 31 Mar 2022, 12:32 pm
నాలుగేళ్లుగా వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలు ఒప్పుకోవడంతో వారిని కాదని మరి పెళ్లి చేసుకున్నారు. రెండు నెలలు బాగానే కలిసి ఉన్నారు.. ఆ తర్వాత ఏమైందో కానీ.. యువతి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది.. ఈ ఘటన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


వివరాల్లోకి వెళ్తే.. నాంపల్లికి చెందిన విజయలక్ష్మి అనే యువతి మూసాపేట్‌కు చెందిన రజాక్ అనే యువకుడు నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే వీరు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే వీరి ప్రేమను, పెళ్లిని ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఈ ప్రేమ జంట గత రెండు నెలల క్రితం తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు..

అనంతరం యువకుడి ఇంటికి వెళ్లగా తల్లిదండ్రులు వారి పెళ్లిని అంగీకరించలేదు. దీంతో విజయలక్ష్మి తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.. విషయం తెలుసుకున్న వెంటనే నాంపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విజయలక్ష్మి భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.