యాప్నగరం

పటాన్‌చెరు: పెళ్లికి నో చెప్పిన ప్రియుడు.. వదలకుండా వేధింపులు, యువతి షాకింగ్ నిర్ణయం

ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువతి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో చోటుచేసుకుంది.

Samayam Telugu 12 Jan 2021, 8:03 am
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో యువత బలవన్మరణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో విషాదం నింపింది. పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన విజయలక్ష్మి తన చిన్న కుమార్తె శ్రావణి(21)తో కలిసి నివసిస్తోంది. భర్త లక్ష్మారెడ్డి కోహిర్‌ మండలం పీచేరేగడిలో వేరుగా ఉంటున్నారు. బీకాం పూర్తి చేసిన శ్రావణి ఏడాదిన్నరగా పక్కింటిలో ఉన్న వెంకటరామ్‌ అనే యువకుడిని ప్రేమిస్తోంది. అతడు కూడా శ్రావణిని ప్రేమిస్తున్నట్లు చెప్పి షికార్లకు తీసుకెళ్లేవాడు.
Samayam Telugu శ్రావణి(ఫైల్ ఫోటో)


Also Read: కరోనా తల్లిదండ్రులు మృతి.. ఇంటికి పిలిచి నిప్పింటించిన చెల్లి.. ఆస్తి కోసం కిరాతకం

వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో శ్రావణి మేనమామ రాజేశ్వర్‌రెడ్డి పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అయితే ప్రేమ పెళ్లికి తన తల్లిదండ్రులు ఒప్పుకోరని వెంకట్రామ్ చెప్పడంతో అంతా షాకయ్యారు. దీంతో ఇకపై తమ అమ్మాయి వెంట పడొద్దని రాజేశ్వర్‌రెడ్డి అతడిని హెచ్చరించాడు. ఇటీవల రాజేశ్వర్‌రెడ్డి చనిపోవడంతో వెంకట్రామ్‌ మళ్లీ శ్రావణి వెంట పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి తన కూతురిని వేధించొద్దని ఫోన్ చేసి మందలించింది.

Also Read: మహబూబ్‌నగర్: వాహనంతో తొక్కించి మహిళ దారుణహత్య, భర్త ఎస్కేప్

ఈ క్రమంలోనే ప్రేమించిన వ్యక్తి తనను పెళ్లి చేసుకోవడం లేదని శ్రావణి మనోవేదనకు గురయ్యేది. ప్రియుడి లేని జీవితం తనకొద్దని భావించి ఆదివారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విజయలక్ష్మి స్థానికుల సాయంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లే సరికే శ్రావణి ప్రాణాలు కోల్పోయింది. విజయలక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.