యాప్నగరం

'మా నాన్న ఏపీ ఎమ్మెల్సీ .. నేను వైఎస్సార్‌టీపీ నగర అధ్యక్షుడిని..' వెలుగులోకి యువకుడి దందా

తన తండ్రి ఆంధ్రప్రదేశ్‍కు చెందిన ఎమ్మెల్సీ.. తాను కాబోయే వైఎస్సార్ తెలంగాణ పార్టీ నగర అధ్యక్షుడిని.. అంటూ ఓ యువకుడు పొలిటికల్ దందాకు తెరతీశాడు. ఇవే మాటలు చెప్తూ.. ఓ ఐటీ సంస్థతో సంప్రదింపులు చేసి లక్షలకు లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో.. పోలీసులు వెంటనే సదరు యువకుడుని అరెస్టు చేశారు. ఆ యువకుడు ఇలాంటి మోసాలు ఇంకా ఎన్ని చేశాడు.. అతను చెప్పే విషయాలు నిజమేనా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 5 Jan 2023, 3:33 pm

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్‌లో పొలిటికల్ బ్కాగ్రౌండ్ పేరుతో యువకుడి దందా
  • తన తండ్రి ఎమ్మెల్సీ, తాను కాబోయే నగర అధ్యక్షుడినంటూ మోసం
  • ఐటీ కంపెనీ నిర్వాహుకుడి నుంచి 28 లక్షలు కాజేసిన యువకుడు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ysrtp
వైఎస్సార్ తెలంగాణ పార్టీ
హైదరాబాద్‌ (Hyderabad) లో ఓ యువకుడు సరికొత్త దందా (Cheating) కు తెరలేపాడు. తన తండ్రి ఆంధ్రప్రదేశ్‌ (Andhra pradesh) కు చెందిన ఎమ్మెల్సీ (AP MLC) అని.. తాను వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party) నగర అధ్యక్షుడిని అంటూ.. హైదరాబాద్‌లో మోసాలకు పాల్పడుతున్న ఘటన వెలుగుచూసింది. పొలిటికల్ బ్యాగ్రౌండ్ (Political Background) పేరు చెప్పుకుని.. ఐటీ సంస్థ (IT Company) కు చెందిన నిర్వాహకుడిని మోసం చేసి లక్షల్లో డబ్బులు కాజేస్తున్నాడు ఓ యువకుడు. ఎస్సార్ నగర్‌లోని అంకమ్మ బస్తీకి చెందిన కార్తీక్ రెడ్డి అనే యువకుడు... తన తండ్రి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్సీ రామ్మోహన్ రెడ్డి అని చెప్పటమే కాకుండా.. తాను వైయస్సార్ తెలంగాణ పార్టీలో కాబోయే నగర అధ్యక్షుడిని అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. అక్కడితో ఆగకుండా.. ఆయా సంస్థల నిర్వాహుకులను మాయమాటలు చెప్పి లక్షల్లో డబ్బు గుంజుతున్నాడు. ఈ నేపథ్యంలోనే కార్తీక్ రెడ్డి వలలో చిక్కుకుని ఓ ఐటీ సంస్థ నిర్వాహకుడు లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాడు.
తాను వైఎస్సార్ తెలంగాణ పార్టీలో త్వరలోనే నగర అధ్యక్షుడిని కాబోతున్నానని చెప్పుకుంటూ జీపీఎస్ ఇన్ఫోటెక్ ఐటీ సంస్థ నిర్వాహకుడైన సూర్యవంశీ ప్రకాష్‌ను నమ్మించాడు. ఇదే క్రమంలో.. అతని వద్ద నుంచి 28 లక్షల రూపాయలు వసూలు చేశారు. అయితే.. అనుమానం వచ్చిన సూర్యవంశీ ప్రకాష్ బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ చేయగా.. తాను మోసపోయానని గ్రహించాడు. వెంటనే సూర్యవంశీ ప్రకాష్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సార్‌నగర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసుకొని కార్తీక్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇలాంటి మోసాలు ఇంకా ఏమైనా చేశాడా.. లేక ఇదొక్కటేనా.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

'సాయి పల్లవి' పాటతో పిల్లలకు టీచర్ పాఠం.. ఎంత బుద్ధిగా వింటున్నారో.. ఐడియా అదుర్స్
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.