యాప్నగరం

నాంపల్లి కోర్టులో వైఎస్ విజయమ్మ, షర్మిల.. జడ్జి ఎదుట హాజరు, ఆ కేసు తేలేదెన్నడో!

Nampally Court: కొద్ది రోజుల క్రితం ఈ కేసులో కోర్టు వైఎస్ విజయమ్మకు, షర్మిలకు సమన్లు జారీ చేసింది. ఈ ఇద్దరితో పాటుగా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి కూడా సమన్లు జారీ అయ్యాయి.

Samayam Telugu 19 Jan 2021, 4:35 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్. విజయమ్మ, సోదరి షర్మిల మంగళవారం నాంపల్లిలోని కోర్టుకు హాజరయ్యారు. పరకాల ఎన్నికల ప్రచారం వ్యవహారంలో వీరు కోర్టు ఎదుట హాజరుకావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా విచారణను నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఈ నెల 27కు వాయిదా వేశారు. వైఎస్ విజయమ్మ ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సీపీకి గౌరవాధ్యక్షురాలిగా ఉన్న సంగతి తెలిసిందే.
Samayam Telugu వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ (ఫైల్ ఫోటోలు)
ys vijayamma ys sharmila


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో 2012లో జరిగిన ఉప ఎన్నికల సమయంలో పరకాలలో ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై ఎన్నికల కార్యక్రమం నిర్వహించారని వీరిపై కేసు ఉంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని 2012లోనే పరకాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 2012లో జగన్‌కు మద్దతుగా కాంగ్రెస్, టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. దీంతో పరకాలలో ఉప ఎన్నికలు జరపాల్సి వచ్చింది. ఆ సమయంలో తెలంగాణలోని పరకాల నుంచి కొండా సురేఖ వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. ఈ సమయంలోనే విజయమ్మ, షర్మిల పరకాలకు ప్రచారానికి వచ్చిన సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. ఆ ఎన్నికల్లో సురేఖ, టీఆర్ఎస్ అభ్యర్ధి బిక్ష్మయ్య మధ్య హోరా హోరీ పోటీ సాగింది.

అయితే, కొద్ది రోజుల క్రితం ఈ కేసులో కోర్టు వైఎస్ విజయమ్మకు, షర్మిలకు సమన్లు జారీ చేసింది. ఈ ఇద్దరితో పాటుగా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి కూడా సమన్లు జారీ అయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.