యాప్నగరం

'అది ఎంతవరకు వచ్చిందో కనుక్కోండి..' గరవ్నర్‌కు వైఎస్ షర్మిల లేఖ

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు వ్యవహారంలో.. సిట్ దర్యాప్తు ఎంత వరకు వచ్చిందన్న ప్రోగ్రెస్ రిపోర్టు తెలుసుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో షర్మిల.. తనకున్న పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే.. ప్రధానంగా ఈ వ్యవహారంలో ఐటీ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. తనకున్న రాజ్యాంగ అధికారం ప్రకారం ఆ దిశగా సిట్ ఎంత వరకు దర్యాప్తు చేసిందన్న రిపోర్టు తెలుసుకోవాలని కోరారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 27 Apr 2023, 7:19 pm

ప్రధానాంశాలు:

  • గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌కు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ
  • పేపర్ లీకేజీ వ్యవహారంలో తనకున్న అనుమానాలు వ్యక్తం చేసిన షర్మిల
  • పేపర్ లీకేజీ కేసులో ఐటీ పాత్ర ఎంతుందో తెలుసుకోవాలని లేఖ

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu sharmila kcr
షర్మిల
TSPSC పేపర్ లీక్ స్కాంలో ఐటీ విభాగం పాత్రపై సిట్ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో నివేదిక కోరాలంటూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం యావత్ రాష్ట్రాన్నే కుదుపేసిన సంగతి తెలిసే ఉంటుందని... సంవత్సరాల తరబడి కష్టపడి పరీక్షలకు ప్రిపేర్ అయిన అభ్యర్థుల ఆశల మీద నీళ్లు చల్లి, వాళ్ల భవిష్యత్తు ప్రశ్న్రార్థకంగా మార్చిందన్నారు. నెలన్నరకు ముందే ప్రెస్ మీట్ పెట్టిన టీఎస్పీఎస్సీ ఛైర్మన్ డా జనార్దన్ రెడ్డి కీలక విషయాలు బయటపెట్టారన్నారు. అరెస్ట్ అయిన రాజశేఖర్ రెడ్డి అనే నెట్వర్కింగ్ నిపుణుడు ఐపీలను బయట నుంచి యాక్సెస్ చేశాడని.. ప్రవీణ్ అనే మరొక్క నిందితునితో కలిసి ఈ పని చేసినట్టు వివరించారు. ఈ విధంగా ఐపీలు తెలుసుకుంటే ఎక్కడినుంచైనా కమిషన్‌కు సంబంధించిన డేటా పొందవచ్చన్నారని తెలిపారు. మరి తెలంగాణ సర్కారు సంస్థలన్నిటి ఐటీ అవసరాలను చూసుకునే కొందరు వ్యక్తులు కచ్చితంగా ఈ నేరంలో వీరికి సహకరించి ఉంటారని.. లేకపోతే ఇది సాధ్యం కాదని స్పష్టమైందని తెలిపారు. మరి ఐటీ శాఖ మీద విచారణ ఎందుకు లేదని ప్రశ్నించారు. ఆ శాఖ ఎవరి అధీనంలో ఉందని ప్రశ్నించే ధైర్యం ఎవ్వరూ చెయ్యట్లేదని వైఎస్ షర్మిల తెలిపారు.

"ఇది ఖచ్చితంగా ఐటీ శాఖ వైఫల్యమే. అందులో పనిచేస్తున్న కొందరి దురాశకు వేల విద్యార్థులు భవిత బలి అవుతోంది. సాక్షాత్తు సీఎం తనయుని నిర్వహణలో పని చేసే శాఖలోని నేరస్థులను ఎవరో పట్టుకుని శిక్షించే ఆలోచనే లేదు. ఈ శాఖ జోలికి సిట్ వెళ్లనే వెళ్లట్లేదు. పెద్దతలలు బయటపడతాయని భయం ఏమో. పోలీసులు ఈ దిశగా విచారణ చేయకపోతే అసలు కేసు క్లోజే కాదు. దీన్నిబట్టి చుస్తే ఇది స్పష్టంగా డేటా స్టోరేజీకి సంబంధించిన వైఫల్యమే. ఇలా ఐతే అసలు డేటా యాక్సెస్ చేయడానికి అథెంటికేషన్, ఖచ్చితంగా రెగ్యులర్ ఆడిట్స్, చెక్స్ ఇవన్నీ అసలు జరుగుతున్నాయా లేదో అనే అనుమానం ప్రజలకు ఉంది. మరిన్ని పేపర్ లీకుల సంగతి, ఐటీ విభాగం నిర్వహణలో ఉన్న ఇతర రాష్ట్ర ప్రభుత్వ శాఖల సమాచారం భద్రత, ఇవన్నీ ప్రజానీకాన్ని కలవరపెడుతున్నాయి." అని షర్మిల తన లేఖలో పేర్కొన్నారు.

తమకున్న రాజ్యాంగ అధికారాల ద్వారా ఐటీ విభాగం, అందులోని కొందరి పాత్రపై, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆక్ట్, 2000 కింద విచారణ ఎంత వరకు వచ్చిందో సిట్‌ను ప్రోగ్రెస్ రిపోర్ట్ అడగి తెలుసుకోవాలంటూ గవర్నర్‌ను షర్మిల అడిగారు. ఇది చాలా కీలకమైన అంశమని.. ఏ సర్కారు అయితే పేపర్ లీకు ఆరోపణలు ఎదుర్కుంటుందో.. ఆ సర్కారే విచారణ చేపడుతోందన్నారు. ఇందులో చిన్నవారిని పట్టుకుని, పెద్దతలకాయలు తప్పించుకునే ప్రమాదం స్పష్టంగా కనపడుతోందని.. గవర్నర్‌కు రాసిన లేఖలో తన అనుమానం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల.
ఇదే లాస్ట్ వార్నింగ్.. మళ్లీ రిపీటైతే పార్టీ నుంచి బయటకే..: కేసీఆర్
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.